అమరావతి (చైతన్యరథం): ఉద్యోగ సంఘాలు సమాజాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. పౌర సమస్యల పరిష్కారంలో ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా పని చేయాలన్నారు. ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను సచివాలయంలోని వారి కార్యాలయంలో బుధవారం కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అభివృద్ధితో పాటుగా ప్రభుత్వ ఆలోచనలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పారదర్శకమైన పనితీరుతో ఉద్యోగ సంఘానికి ప్రత్యేక గుర్తింపు సాధించేలా పని చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.కుమారేశ్వరన్, ప్రధానకార్యదర్శి బొడపాటి నరసింహులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.రాజశేఖర్ గౌడ్, కోశాధికారి శ్రీలత, ఉపాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస్, బాలయ్య, సంయుక్త కార్యదర్శులు అజయ్ సింగ్, శ్రీధర్ రాయ్, జల్లి రమేశ్, కార్యవర్గ సభ్యులు అరుణకుమారి, చంద్రశేఖర్ రెడ్డి, రేణుక, బి.సుబ్బారావు పాల్గొన్నారు.