పత్రికా స్వేచ్ఛ అణచివేత, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని, ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్లో మరిన్ని తీవ్ర పరిణామాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కొందరు సంపాదకులు అందరూ కొమ్మినేని శ్రీనివాస రావును కీర్తిస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఆక్రోశించారు. గత ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను జగన్ బూటుకాలితో నలిపేసినా నోరు తెరవని ఈ సంపాదకులు.. ఇప్పుడు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ రోధించడం రోతగా లేదా? అమరావతి రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా సాక్షి మీడియాలో మాట్లాడిన జర్నలిస్టు వ్యాఖ్యలను సమర్ధించే విధంగా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేస్తే ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్చకు విఘాతం కలిగి పత్రికా ప్రపంచమంతా స్తంభించి పోయినట్టు సంపాదకులు తెగ బాధపడిపోయారు. కొమ్మినేని అరెస్టుతో ప్రభుత్వ ఉద్దేశ్యం బయటపడిరదంటూ సంపాదకులు ఉక్రోషం వెళ్లగక్కారు. అసలు మీడియాలో తప్పుడు విధానాలకు తెరతీసింది ఎవ్వరు? సాక్షి యాంకర్ను అరెస్టు చేస్తే అక్రమం అని శోకాలు పెట్టడం ఏమిటి? మీడియా ముసుగులో దారుణమైన వ్యాఖ్యలు చేసి వ్యక్తిత్వహననానికి పాల్పడి అవమానించినా ఈ సంపాదకులు సమర్థిస్తారా? వీరు సమాజం పక్షమా? లేక మహిళలను అవమానించినవారి పక్షమా? అని నిలదీస్తున్నారు మహిళలు.
ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్చకి గొడ్డలిపెట్టు అంటూ సంపాదకులు గుండెలు బాదుకొన్నారే, మరి అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? మీకు నచ్చిన మీడియాలో చేసిన బూతులను, అరాచకాలను దాచిపెట్టడమే నిఖార్సయిన జర్నలిజం అనుకొంటున్నారా? సంపాదకులు కోరుకొంటున్న జర్నలిజం సమాజానికి ఉపయోగపడదని గుర్తించాలి. పూర్వం రాజులు ఆస్థానంలో పొగడ్తల కోసం కొంతమంది ప్రత్యేకంగా ఉండేవారట. ఆ విధంగానే నేడు జగన్రెడ్డి ఆస్థానంలో చేరారు అలాంటి వారు. అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో బరితెగించి చేసిన వికృత వ్యాఖ్యలు చూసి సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకుంది. సభ్యతమరచి ఆవేశంతో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మహిళలను ఘోరంగా అవమానించారు. క్రూరమైన, వికృతమైన ఆలోచనకు ప్రతిరూపమే ఇలాంటి వ్యాఖ్యలు. మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన వ్యక్తి మాటలను ఖండిరచని వ్యక్తిపై ప్రశంసల జల్లులు కురిపించడం దేనికి సంకేతం? ఆ వ్యాఖ్యలను సంపాదకులు కూడా సమర్థిస్తున్నట్లే కదా. మానవత్వంలేని అత్యంత క్రూర ఆలోచనలున్నవారే ఇలా వ్యవహరిస్తారు.
అటువంటివారికి సంపాదకులు మద్దతుగా నిలిస్తే ప్రజలు తమను తాము కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయినా ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకి గొడ్డలిపెట్టు అంటున్న ఈ స్వచ్ఛ సంపాదకులకు అవి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా? గతంలో మీడియా వాచ్ పేరుతో 2007లో మీడియాపై ఆంక్షలు విధించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి 938 జీవో తెచ్చారు. తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీడియా గొంతు నులిమేందుకు జీవో 2430ని జారీ చేసారు. తర్వాత జీవో 1తెచ్చి రాష్ట్రానికే సంకెళ్లు వేసారు. మరి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పరిఢవిల్లాలని కోరుకొనే ఈ సంపాదక వర్గానికి ఆ రోజు కనపడలేదా? ఈ రోజు ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అంటూ వగచే ఈ సంపాదకులు అప్పుడు ఎందుకు మాట్లాడ లేదు.? స్వార్ధ సంపాదకులు ప్రవచించె నీతుల కింద నిజం కప్పబడిరది.
సీనియర్ సంపాదకులమంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని నిందించారు. మరి గత ప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛను హరించినప్పుడు ఏమయ్యారు ఈ సంపాదకులు? ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్చకీ గొడ్డలి పెట్టు అంటూ గగ్గోలు పెడుతున్న ఈ సంపాదకులు వీటికి సమాధానం చెప్పాలి.
సాక్షి యాంకర్ను అరెస్టు చేస్తే ఎదో జరిగిపోయినట్టు ప్రభుత్వంపై విషం కక్కడం ఎవరిమెప్పు కోసం? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి? ఒకపక్కన పచ్చిగా నిజానిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి పచ్చి అబద్దాల, అరాచక రాతలు వ్రాస్తున్నా ఎన్నడూ నోరు తెరవని ఈ సంపాదకులు విలువలు, కక్ష సాధింపు, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్చ Ûఅంటూ పెద్ద,పెద్ద డైలాగులతో గురివింద నీతులు వల్లించడం విడ్డురంగా లేదా? మీడియా ముసుగులో నిత్యం గిట్టనివారిపై ఇష్టానుసారం బూతు రాతలు అచ్చేస్తూ.. ఏదిపడితే అది రాసేందుకు రెండుమూడు పేజీలు కేటాయించి.. ఉన్నదీ లేనిదీ గాలి పోగేసి విషపు రాతలు రాస్తున్నా.. ఆ తప్పుడు కధనాలు తప్పు అనిపించడంలేదా? వివేకా హత్య అనంతరం మీకు నచ్చిన సాక్షి పత్రికలో నారాసుర రక్తచరిత్ర అంటూ రాసిన అభూత కల్పన కథనాన్ని ఈ సంపాదకులు ఎందుకు ఖండిరచలేదు? ఆ రోజు ఆ కథనం ఈ సంపాదకులకు శభాష్ అనిపించిందా? అది ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛనా? జగన్ ఏలుబడిలో జర్నలిస్టులు, పత్రికలపై, పత్రికా కార్యాలయాలపై రాళ్ళ దాడులు చేయడం మున్నెన్నడూ చూడలేదు. ఆంధ్రజ్యోతి పత్రిక ఫొటో జర్నలిస్టుపై జెండా కర్రలతో దాడి చేయ్యడం, వెంటాడి కొట్టడం, కింద పడేసి కాలితో తొక్కుతూ చంపే ప్రయత్నం చెయ్యడం -కర్నూలులో వందలమంది వైసీపీ కార్యకర్తలు ఈనాడు కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం.. పత్రికా స్వేచ్చను, భావ ప్రకటనా స్వాతంత్రాన్ని కబళించడం కాదా?
మూడు మీడియా వ్యవస్థలను అసెంబ్లీకే రాకుండా అడ్డుకొన్నా, ఏపీలో రెండు ఛానళ్లను నిలిపివేసినా, మీడియా వ్యవస్థల ప్రతినిధులుపై, జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినా ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ ఈ సంపాదకులకు గుర్తు రాలేదా? మీరు చెప్పిన నీతులు మీకు నచ్చినవారికి వర్తించవా? మీరు నచ్చినవారికి ఒక రూలు, మీకు నచ్చని వారికి మరొక రూలు ఉంటుందా? మీరు ఈరోజు ఒకవైపే వత్తాసు పలకడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలి? మహిళను అవమానాలకు గురి చేసే వ్యాఖ్యలు చెయ్యడం, వ్యక్తిత్వ హననం చెయ్యడం వంటివి భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలోకిరావని మీకు తెలియదా? రూల్ ఆఫ్ లా సాక్షి యాజమాన్యానికి, సాక్షిలో పనిచేసే సిబ్బందికి వర్తించదా? ఆంధ్రజ్యోతి సహా ఇతర ఛానెళ్లను ఐదేళ్లపాటు నిలిపి వెయ్యడం? ఆంధ్రజ్యోతికి, ఏబీఎన్ ఛానల్కు ఐదేళ్లు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రకటనలు ఒక్కటికూడా ఇవ్వకపోవడం పత్రికా స్వేచ్ఛనా? మీకు నచ్చిన ప్రభుత్వ తీరు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆర్టికల్ 19 (1)కు విరుద్దంగా లేదా? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరిస్తే ఈ మహాసంపాదక వర్గం ఎందుకు మాట్లాడలేదు? అధికారం కొల్పోయిన తర్వాత కూడా సాక్షి పత్రిక, ఆ ఛానెల్ ప్రజా ప్రతినిధులను అవమానించేలా దుష్ప్రచారం చేస్తున్నా ఈ సంపాదకులకు కనపడటం లేదా? అందుకే సంపాదకుల ఆక్రందనలు, ఆక్రోశం ఎవరిమెప్పు కోసమో, ఎవరి కళ్లలో ఆనందం చూడటం కోసమో అర్ధం చేసుకోలేనంత అమాయకులు మాత్రం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.
నీరుకొండ ప్రసాద్