అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనలకు తరచూ వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనల కోసం హెలికాప్టర్ వాడుతుంటారు. అయితే ఈ హెలికాప్టర్ భద్రతపై మాత్రం అధికారులు అంతగా దృష్టి సారించడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన సందర్భంగా ఈ సంగతి బయటపడిరది. ఆదివారం ఏపీకి వచ్చిన గోయల్.. సీఎం జిల్లాల పర్యటనలకు వాడే హెలికాప్టర్లోనే తిరుపతి వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం అదే హెలికాప్టర్లో గోయల్ కృష్ణపట్నం వెళదామని ముందే ప్లాన్ చేసుకున్నారు. అయితే హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా కృష్ణపట్నం టూర్ను రద్దు చేసుకున్న గోయల్ నేరుగా ఢల్లీి వెళ్లిపోయారు.
సీఎం చంద్రబాబు జిల్లాల టూర్లకు వినియోగించే ఈ హెలికాప్టర్నే ఏపీకి వచ్చే వీవీఐపీల పర్యటనకూ వినియోగిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి టూర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సమస్య నేరుగా డీజీపీ దృష్టికి చేరింది. తరచూ ఈ హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో అసలు ఈ హెలికాప్టర్ను ఇకపై వినియోగించవచ్చా..లేదా స్పష్టంగా పేర్కొంటూ ఒక నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.