అమరావతి (చైతన్య రథం): అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాద ఘటన సమాచారం తెలుసుకుని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భారీగా ప్రాణ నష్టం సంభవించిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈరోజు సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి గురువారంనాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా అమరావతిలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏంసాధించింది? రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటోంది? ఏ విజన్తో అడుగులు ముందుకు వేయనుందన్న అంశాలు ప్రజలకు వివరించేలా కార్యక్రమం రూపొందించారు. సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి పునరంకితమయ్యేలా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.