- రూ.9.5లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5లక్షల ఉద్యోగాలకు ఒప్పందం
- పరిశ్రమలు ప్రారంభమయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి
- ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణ… మరోవైపు పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి
- ఉపాధి కల్పన మంత్రుల కమిటీ సమావేశంలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో సాధించలేని పెట్టుబడులను చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం 11నెలల్లో సాధించిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, ఉపాధి కల్పన మంత్రుల కమిటీ చైర్మన్ నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో బుధవారం మంత్రి లోకేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 20లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ.9.20 లక్షల కోట్ల విలువైన 78 భారీ పరిశ్రమలు, రూ.13,895 కోట్ల విలువైన 1,19,580 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని యువతకు 8.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో భారీపెట్టుబడులు, అత్యధిక ఉద్యోగాల కల్పించేందుకు ముందుకు వచ్చిన ఎన్టీిపీసీి, బిపిసిఎల్, రిలయన్స్, టాటా పవర్ వంటి సంస్థలకు పరిశ్రమలవారీగా ఈడిబిలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పిఎంయు)లను ఏర్పాటుచేసి, పరిశ్రమ స్థాపించేవరకు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వాట్సాప్ గవర్నెన్స్తో అనుసంధానం
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి భూమితోపాటు ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పించాలనిన్నారు. అతిపెద్ద తీరప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో పర్యాటకరంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, బీచ్ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. విశాఖలో ఒబెరాయ్, వరణ్ బీచ్ శాండ్స్ వంటి స్టార్ హోటళ్ల నిర్మాణాలకు అవసరమైన అనుమతులతోపాటు ప్రభుత్వపరంగా పవర్, వాటర్ వంటి సదుపాయాలను సమకూర్చాలన్నారు. రాష్ట్రంలో బీచ్ శ్యాండ్, కోల్ గ్యాసిఫికేషన్ మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అన్వేషించాలని సూచించారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను సమకూర్చేందుకు యువతకు నైపుణ్యశిక్షణ అందించాలని, స్కిల్ ఎకోసిస్టమ్ కల్పించాలన్నారు. బిసిసిఐ సహకారంతో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని, దీనిద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్తో అనుసంధానం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు.
ప్రాజెక్టుల ప్రారంభానికి వేగవంతంగా చర్యలు
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ)ల ద్వారా ఎక్కువమందికి ఉపాధి లభించే అవకాశమున్నందున ఆ పరిశ్రమలకు పెట్టుబడుల మద్దతు కోసం పిఎంఇజిపి (ూతీఱఎవ వీఱఅఱర్వతీ జుఎజూశ్రీశీవఎవఅ్ Gవఅవతీa్ఱశీఅ ూతీశీస్త్రతీaఎఎవ) తో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణతోపాటు మరోవైపు ఆయా ప్రాజెక్టుల ప్రారంభానికి వేగవంతంగా చర్యలు చేపటాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అనుసరిస్తున్నామని, వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగూరి నారాయణ, కందుల దుర్గేష్, టిజి భరత్, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, టూరిజం శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సిఇఓ సాయికాంత్ వర్మ, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఎపిఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్, చీRజుణజAూ విసి అండ్ ఎండి కమలాకర్ బాబు, గనులశాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.