- నాణ్యత లోపం సాకుతో తిరస్కరిస్తే కఠిన చర్యలు
- వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
గుంటూరు(చైతన్యరథం): పొగాకు వ్యాపారులు తక్షణమే నల్ల బర్లీ పొగాకు కొను గోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. నాణ్య త లోపం సాకుతో తిరస్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవా రం గుంటూరు లామ్ వద్ద ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు అధ్యక్షతన నల్ల బర్లీ పొగాకు కొనుగోలుపై రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పొగాకు వ్యాపారులు, రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికా రులు, పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా పొగాకు వ్యాపారులు, నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయకుండా తాత్సా రం చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందుకు గురి చేస్తున్నారని..ఈ అంశం చాలా ఆందోళన కలిగించిందని తెలిపారు. ముఖ్యమంత్రి నల్ల బర్లీ పొగాకును వ్యాపారులు ఎటువంటి నాణ్యతా ప్రమాణాల షరతులు విధించకుండా తక్షణమే కొనుగోలు చేయాలని ఆదేశిం చినట్లు తెలిపారు. 30 శాతం సాగులో ఉన్న బర్లీ పొగాకును కూడా కొనుగోలు చేయా ల్సిన అవసరం ఉందని సూచించారు.
దీనిపై పొగాకు వ్యాపారులు స్పందిస్తూ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఒక పది శాతం మేర కొనుగోలు ప్రక్రియ మొదలైందని, ఇకనుంచి మరింత పుంజుకుని 100 శాతం బర్లీ పొగాకును కొనుగోలు చేస్తామని సమాధానమిచ్చారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ గురువారం నుంచి పొగాకు బోర్డు కార్యాలయంలో కాల్ సెంటర్ను ప్రారంభించి, మరింత ప్రచారం చేయా లని, పొగాకు వ్యాపారులు, కంపెనీలు తప్పనిసరిగా కొనుగోలు ప్రక్రియలో పాల్గొనేలా చేయాలని, కంపెనీల వారీగా కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని, నాణ్యత ప్రమా ణాలు లేవనే అంశంతో తిరస్కరణ చేయరాదని వ్యవసాయ సంచాలకులు డిల్లీరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, రైతు నాయకులు జములయ్య, కృష్ణయ్య, హరిబాబు, రైతులు, పొగాకు కంపెనీలు, వ్యాపా రులు పాల్గొన్నారు.