అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 10 జిల్లాలకు సంబంధించిన పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్లను నియమిస్తూ ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్లు వీరే..
శ్రీకాకుళం: శివ్వల సూర్యనారాయణ (టీడీపీ)
విశాఖ: కోన తాతారావు ( జనసేన)
విజయనగరం: కిమిడి నాగార్జున (టీడీపీ)
గుంటూరు: మాకినేని మల్లికార్జునరావు (టీడీపీ)
కృష్ణా: నెట్టెం రఘరామ్ (టీడీపీ)
నెల్లూరు: ధనుంజయరెడ్డి (టీడీపీ)
చిత్తూరు: అమాస రాజశేఖర్రెడ్డి (టీడీపీ)
అనంతపురం: కేశవరెడ్డి (టీడీపీ)
కర్నూలు: విష్ణువర్థన్రెడ్డి (టీడీపీ)
కడప: బి. సూర్యనారాయణరెడ్డి (టీడీపీ)
జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంస్) ఛైర్మన్లు
శ్రీకాకుళం: అవినాష్ చౌదరి(టీడీపీ)
విశాఖ: కొట్ని బాలాజీ(టీడీపీ)
విజయనగరం: గొంప కృష్ణ (టీడీపీ)
గుంటూరు: వడ్రాణం హరిబాబు (టీడీపీ)
కృష్ణా: బండి రామకృష్ణ(జనసేన)
నెల్లూరు : గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ)
చిత్తూరు: సుబ్రమణ్యం నాయుడు (టీడీపీ)
అనంతపురం: నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ)
కర్నూలు: నాగేశ్వరయాదవ్ (టీడీపీ)
కడప: యర్రగుండ్ల జయప్రకాశ్ (టీడీపీ)