అమరావతి (చైతన్యరథం): ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించింది.