- దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరింపులు
- తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా వంశీ అరాచకాలు
- టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడుల్లో వాస్తవాలివే
- ఫిర్యాదు చేసేందుకే పోలీసుస్టేషన్కు వెళ్లాను
- ప్రశ్నించిన బీసీ నాయకుడిపైనా దాడి చేశారు
- గన్నవరంలో వంశీ అనుచరులు బరి తెగించారు
- నన్ను చంపేందుకు జగన్రెడ్డి గూండాల యత్నం
- ఘటనను వక్రీకరిస్తూ జగన్రెడ్డి నేడు అబద్ధాలు
- బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటే నేరస్తులేనా
- నేడు మూడు సింహాలంటూ మాట్లాడడం హాస్యాస్పదం
- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
మంగళగిరి(చైతన్యరథం): దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాం గ్మూలం ఇచ్చేలా ప్రేరేపించిన వంశీని జగన్రెడ్డి పరామర్శించడం సిగ్గుచేటు అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ అరాచకవాదితో ములాఖత్ అయ్యి బయటకు వచ్చి మీడియాతో పచ్చి అబద్ధాలా డుతున్నారు..ఐదేళ్లు నిస్సుగ్గుగా అబద్ధాలాడారు కాబట్టే ఎన్నికల్లో వైసీపీనీ 11 సీట్లకే పరి మితం చేశారు. ప్రజలు వాతలు పెట్టినా జగన్రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. గన్నవరంలో ఫిబ్రవరి 20, 2023లో జరిగిన సంఘటనను పూర్తిగా వక్రీకరించి అవాస్త వాలను జోడిరచి ప్రజలను తప్పుదారి పట్టించాలని జగన్రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. అకారణంగా నేను గన్నవరం వెళ్లి వందలమంది కార్యకర్తలను వెంటేసు కుని గన్నవరం వైసీపీ కార్యాలయంపై దాడికి వెళ్లినట్లు జగన్రెడ్డి కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. వంశీ అరాచకాలను ప్రశ్నించిన మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడు దొంతు చిన్నా ఇంటిపైనా నాటి ఉదయం దాడి చేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశా రు. మా పార్టీ బీసీ సోదరుడికి అండగా నిలబడేందుకు వైసీపీ మూకల దాడిపై ఫిర్యాదు చేసేందుకు నేను, ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, దొంతు చిన్న గారిని వెంటబెట్టుకుని పోలీసుస్టేషన్కు వెళ్లాం. బీసీలకు రక్షణగా నిలిబడేందుకు వెళ్లామని తెలిపారు.
పోలీసులు, శాంతి భద్రతలపై వ్యాఖ్యలు హాస్యాస్పదం
వైసీపీ హయాంలో ఫిర్యాదు చేసినా నేరమే. గన్నవరంలో వల్లభనేని వంశీ చేసిన అరాచకాలు, యువ నాయకుడు లోకేష్పై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నాడు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గా నికి వంశీ చెడ్డ పేరు తీసుకువచ్చాడు. గొప్ప గొప్ప వ్యక్తులు పెట్టిన ఉమ్మడి కృష్ణా జిల్లా ను అరాచకాలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మరుస్తుంటే వాటిని అడ్డుకునేందుకు నేను గన్నవరం వెళ్లాను. వందలమందితో నేను వైసీపీ కార్యాలయంపై దాడికి వెళ్లానని జగన్ రెడ్డి అంటున్నాడు… మా కార్యాలయంపై దాడి జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. వారి కార్యాలయంపై నేను దాడికి చేసినట్లు చిన్న మట్టిగడ్డనైనా ఎందుకు చూపించ లేదు? కర్రలు, రాడ్లు, పెట్రోల్ సీసాలతో నాపై జగన్ రెడ్డి మూకలు నన్ను చంపే ప్రయ త్నం చేశారు. నా బాడీగార్డులు నన్ను రక్షించారు. మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసు లు పెట్టి వేధించారు. అక్కడనుంచి నేను బయటపడితే పోలీసులు నన్ను అదుపులోకి తీసుకొని తొట్లవల్లూరు స్టేషన్కు తీసుకువెళ్లారు. జగన్రెడ్డి పథకం ప్రకారం స్టేషన్లో కరెంట్ కట్ చేయించి స్టేషన్ను ఖాళీ చేయించి జగన్రెడ్డి ప్రైవేట్ గూండాలను పంపి నాపై దాడి చేశారు. థర్డ్ డిగ్రీ టార్చర్కు వేదికగా స్టేషన్లను మార్చాడు. టీడీపీ మహిళా నాయకురాలు కళ్యాణిపై అక్రమ కేసులు బనాయించి ఇంటికెళ్లి మహిళ అని కూడా చూడకుండా దుస్తులు మార్చుకోనివ్వకుండా ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి వేధించా రు. జగనరెడ్డి అతిక్రమించిన చట్టం లేదు. నేడు మూడు సింహాలు, పోలీసుల కర్తవ్యం, చట్టాలు, శాంతి భద్రతలు గురించి జగన్రెడ్డి పాఠాలు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జగన్రెడ్డి దమనకాండ
గన్నవరం సంఘటన జరగకముందే దాదాపు 30 మంది బీసీ నాయకులను జగన్ రెడ్డి పొట్టనబెట్టుకున్నాడు. నడిరోడ్డుపై అతికిరాతకంగా తోట చంద్రయ్య పీక కోసి చంపి న మాట వాస్తవం కాదా? నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, అనితా రాణి వంటి వారిని పొట్టనబెట్టుకున్నాడు. జగన్రెడ్డి హయాంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలను ఊచకోత కోశాడు. వారికి అండగా నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా ఎవరు నిలబడినా వారిని నేరస్తులుగా జగన్రెడ్డి ముద్రించాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వారికి అండగా నిలబడ్డాడు. దళిత బిడ్డ వరప్రసాద్కు శిరోముండనం చేశారు. ఇన్ని రకాలుగా వేధించారు. నేడు దళిత వర్గానికి చెందిన యువకుడిని కిడ్నాప్ చేసి వేధించిన వ్యక్తిని పరామర్శించేందుకు జగన్ రెడ్డి వెళ్లాడు. బలహీన వర్గాల వారిపై ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా.. దళిత బిడ్డలను ఎవరు కిడ్నాప్ చేసినా తోడు ఉంటాననే సందేశం ఇవ్వడానికేనా జగన్రెడ్డి నువ్వు ములాఖత్ అయింది? అని ప్రశ్నించారు. దళిత బిడ్డను కిడ్నాప్ చేసి ఉంటున్న ఇంటికే తీసుకువెళ్లిన సీసీ ఫుటేజ్ను విడుదల చేశాం. ఇప్పుడు వంశీ ఉత్తముడని, ఏ పాపం తెలియదని జగన్రెడ్డి చెప్పగలడా? దళితులపై దాడులు జరుగుతుంటే చూస్తే ఉండే ప్రభుత్వం కాదు. బీసీలు, దళితులపై చిన్న గీత పడినా ఉపేక్షించేది లేదు. చట్ట ప్రకారం వంశీని అరెస్టు చేశారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.