- జాతీయ సగటు కంటే తక్కువే
- రవాణా ఖర్చులపై సమీక్షించుకోవాలి
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
- ధరలపై మంత్రుల కమిటీతో సమావేశం
అమరావతి(చైతన్యరథం): పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సచివాలయంలో గురువారం ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ సమావేశం జరిగిం ది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మార్కెట్ ధరలపై నిత్యం పర్యవేక్షణ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు, మిల్లెట్ల కు ప్రోత్సాహం, ప్రస్తుతం మార్కెట్లో ధరల పరిస్థితిని చర్చించారు. నాదెండ్ల మాట్లాడు తూ గత డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ ద్రవ్యోల్బణం రేటు 4.34% కాగా..జాతీయ సగటు 5.22% కంటే తక్కువగా ఉందన్నారు. 154 మండల కేంద్రాల్లోని సీపీ యాప్ ద్వారా ప్రతిరోజూ ధరల సేకరణపై విశ్లేషణ, అదేవిధంగా 151 రైతుబజార్ ధరలను విశ్లేషిస్తు న్నట్లు చెప్పారు. 69 నిత్యావసర సరుకులు ధరలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
వీటిలో ధాన్యాలు, కూరగాయలు, వంటనూనెలు, మసాలాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఏడా దితో పోల్చితే కందిపప్పు (13%), గ్రౌండ్నట్ ఆయిల్ (4%), మిర్చి (27%) ధరలు తగ్గినట్లు వివరించారు. ఏపీ మిషన్ మిల్లెట్ వంటి పథకాల ద్వారా జొన్నలు, రాగులను ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. మిడ్-డే మీల్స్, సంక్షేమ పథకాలలో మిల్లెట్లు చేర్చ డం, మిల్లెట్ వాడకాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించారు. రైతులకు ధరల సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా ఖర్చులు అధికంగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరగడా నికి కారణంగా విశ్లేషిస్తూ ధరల అదుపునకు తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికా రులకు ఆదేశాలు జారీ చేశారు.