- ప్రశ్నిస్తే రౌడీలను పెట్టి బెదిరిస్తున్నాడు
- నంద్యాలకు చెందిన వైసీపీ నాయకుడి దందా
- టిడ్కో ఇలు ఇప్పిస్తామని రూ.5 లక్షలకు టోకరా
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుల ఫిర్యాదు
- ఆర్జీలు స్వీకరించిన రెడ్డప్పగారి శ్రీనివాసులు, అశోక్బాబు
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా వినతుల కార్యక్రమంలో భూ కబ్జాలు, మోసాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి అర్జీదారులను పొలిట్బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివా సులురెడ్డి, ఎమ్మెల్సీ అశోక్బాబు అర్జీలు స్వీకరించారు. నంద్యాల జిల్లా సంజూమల మండలం నొస్సం గ్రామానికి చెందిన అల్లూరి సత్యరాజు సమస్యను వివరిస్తూ తన తండ్రి దేవరాజు పేరుపై ఉన్న 3 ఎకరాల డీకే పట్టాను అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మలికిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి తమ ప్రభుత్వం వస్తే రుణం ఇప్పిస్తానని చెప్పి తన తండ్రి నుంచి తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆ భూమిని తనదేనని రౌడీలను పెట్టి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిని విడిపించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` సర్వే నెం.488-1లో ఉన్న తన 5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కాపు శ్రీదేవి అనే మహిళ తన పేరుకు బదిలీ చేసుకున్నట్లు అనంతపురం జిల్లా కుందుర్తి మండలం యర్రగుంట గ్రామానికి చెందిన ఎం.మంజునాథ్ ఫిర్యాదు చేశారు. ఉన్నతాధి కారులు విచారణ చేసి తన భూమిని కబ్జా నుంచి విడిపించి వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని కోరారు.
` 2018లో టిడ్కో ఇంటిని అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇంటిని రద్దు చేశారని విశాఖపట్నం డాబా గార్డెన్స్కు చెందిన వృద్ధురాలు కున్నత్తు నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇల్లు ఇప్పించి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసింది.
` విజయవాడ రామవరప్పాడుకు చెందిన రామ్, పోరంకికి చెందిన పృథ్వీ అనే ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఇల్లు ఇప్పిస్తామని నాలుగేళ్ల క్రితం రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశారని విజయవాడకు చెందిన పఠాన్ సూరియా సుల్తాన్ ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
` పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన పేరుపోగు ఏసమ్మ సమస్యను వివరిస్తూ తనకు చెందిన 3.1/2 సెంట్ల భూమిని గ్రామానికి చెందిన పేరుపోగు పెదమల్లయ్య ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేసింది. తన భూమిని కబ్జా నుంచి విడిపించి న్యాయం చేయాలని కోరారు.
` తన గ్రామంలో నాలుగేళ్లుగా ఉన్న తాగునీటి సమస్య, స్మశాన వాటిక సమస్యలు పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం జంపపాలెం గ్రామానికి చెందిన శిలపరశెట్టి సత్యనాగదేవకి విజ్ఞప్తి చేశారు.
` గత ప్రభుత్వంలో తన భూమికి సంబంధించిన సర్వే నెంబర్లను వైసీపీ నాయకు లు తప్పుగా నమోదు చేయించారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన కుడుపూడి రామారావు ఫిర్యాదు చేశారు.