- గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరక్టర్ ఆశిష్తో లోకేష్ భేటీ
- విశాఖలో డేటా సిటీ ఏర్పాటుపై చర్చ
న్యూఢిల్లీ (చైతన్య రథం): గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్సింగ్, కంట్రీ డైరెక్టర్ (పబ్లిక్ సెక్టార్ అండ్ ఎడ్ టెక్) ఆశిష్, వారి బృందాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కలిశారు. విశాఖపట్నంలో నెలకొల్పనున్న గూగుల్ క్లౌడ్ డేటా సిటీ అంశంపై చర్చించారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూకేటాయింపులు, పాలసీని త్వరితగతిన ఇస్తామని, ఇందుకోసం ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని మంత్రి లోకేష్.. గూగుల్ బృందానికి వివరించారు. డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని, దీనివల్ల విశాఖ ఐటీ ముఖచిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐలో ప్రపంచస్థాయి అప్లికేషన్లను రూపొందించడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు గూగుల్ డాటా సిటీ ‘గేమ్ ఛేంజర్’ కానుందన్నారు. డిజిటల్ ట్రాన్సఫర్మేషన్కు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్సింగ్ ఈ సందర్భంగా కొనియాడారు. డాటా సిటీ పనుల వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.