శ్రీకాళహస్తి (చైతన్య రథం): శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్లలోని భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపించారన్న ఫిర్యాదుపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ‘ఎక్స్ ‘ వేదికగా భక్తులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన లోకేశ్.. తక్షణ విచారణకు ఆదేశించారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యనూ ఉపేక్షించేది లేదన్నారు. కొంతమంది సిబ్బంది ఇప్పటికీ వైకాపా ప్రభుత్వంలోని విధానాల నుంచి బయటకు రాలేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.