- నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాలాద్రి
- జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు
మంగళగిరి(చైతన్యరథం): ఆధునిక ఆలోచనలతో ముందుకుసాగుతూ యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నాలెడ్జ్ సెంటర్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ జీవితంలో సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన నాయకుడు నారా లోకేష్ అన్నారు. విశిష్టమైన నాయకత్వ లక్షణాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. రాష్ట్రాన్ని సాంకేతికత కేంద్రంగా మార్చేం దుకు డిజిటల్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యువతను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దే పలు కార్యక్రమాలను ప్రారంభించి వారికి ఆదర్శంగా నిలి చారు. నాయకుడు అంటే మార్గాన్ని చూపేవాడు కాదు, ఆ మార్గంలో మనల్ని నడిపిం చే వాడు..అందుకు లోకేష్ నాయకత్వమే నిలువుటద్దమని కొనియాడారు. పంచాయ తీరాజ్ మంత్రిగా పనిచేసిన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. రహదారులు, పరిశుభ్రత, ఇతర మౌలిక అవసరాల ను మెరుగుపరిచారని అన్నారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రతిఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి తమవంతు కృషి చేయా లని పిలుపునిచ్చారు. ఈ జన్మదిన సందర్భంగా లోకేష్ మరిన్ని విజయాలు ఆకాం క్షిస్తూ.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.