చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అమరావతి అభివృద్ధితోనే ఏపీ ప్రగతి

రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం

by చైతన్యరధం
Jul 4, 2024 at 6:09am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అమరావతి అభివృద్ధితోనే ఏపీ ప్రగతి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 26 జిల్లాల ఆదాయ వనరు
  • 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పతరువు
  • ప్రతి పంచాయతీ సంక్షేమానికి భరోసా ప్రజారాజధాని
  • ప్రతి తెలుగుబిడ్డ గర్వించే ప్రపంచస్థాయి నగరం
  • అమరావతి విధ్వంసం జగన్‌ తెలుగుజాతికి చేసిన ద్రోహం
  • విధ్వంస పాలనకు జగన్‌ ఒక కేస్‌ స్టడీ
  • తెలంగాణకు హైదరాబాద్‌ లాగా…ఏపీకి అమరావతి సంపద కేంద్రం అయ్యేది
  • ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తాం…రాజధానిని పునర్నిర్మిస్తాం
  • అమరావతిపై నమ్మకాన్ని మళ్లీ నిలబెడతాం..కేంద్ర సాయంతో ముందుకు సాగుతాం
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన

అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతిని విధ్వంసం చేసి తెలుగుజాతికి జగన్‌ తీరని అన్యాయం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. దేశ చరిత్రలో జగన్‌ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకోరన్నారు. విధ్వంసానికి జగన్‌ ఒక కేస్‌ స్టడీ అన్నారు. మాకు రాజధాని లేదు అని చెప్పుకునేంత పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు.. రాష్ట్రంలో పుష్కలంగా వనరులు ఉన్నాయి…తెలివి తేటలు గల మానవ వనరులు ఉన్నాయి. .ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో రాజధాని అమరావతిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు.

రాష్ట్ర నడిబొడ్డున అమరావతి రాజధాని
రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుదని ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు ఎంతో పరిశీలన చేశాక చరిత్ర సృష్టిస్తుందని అమరావతి పేరును సూచించారు. దానికి రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుండి నీరు, మట్టి తెచ్చాం. దేశంలోని అన్ని పవిత్రమైన ప్రదేశాల నుండి కూడా నీరు, మట్టిని తీసుకొచ్చాం. కొంతమంది అమరావతే రాజధానిగా ఎందుకు ఉండాలని అడుగుతున్నారు…ఆ మూలన ఉన్న కుప్పం వారికైనా…ఈ మూలను ఉన్న ఇచ్ఛాపురం వారికైనా సమదూరంలో అమరావతి ఉంటుంది. బుద్ధి ఉన్న ఏ వ్యక్తీ అమరావతి రాజధానిని వ్యతిరేకించరు. రాజధానికి రెండు వైపులా 12 చొప్పున పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. విభజన అనంతరం శివరామృష్ణ కమిటి రాష్ట్రంలో పర్యటిస్తే…కృష్ణా, గుంటూరు లేదా ఆ రెండు జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది తమ అభిప్రాయాలను చెప్పారు. అప్పటికే రూ.15 వేల కోట్లు ఆర్థిక లోటు ఉంది.

సంబంధితవార్తలు

మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు

పోలవరం విధ్వంసంతో జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేశాడు

అమరావతిపై వేగంగా అడుగులు

సైబరాబాద్‌ నిర్మాణ అనుభవంతో అమరావతిని నిర్మించాలని ఆలోచించాం. హైదరాబాద్‌కు నాడు సరిగా కరెంట్‌, నీళ్లు లేవు…రానురాను అన్నీ కలిసొచ్చాయి. ఎంతో మంది ప్రయత్నించినా వీలుపడని కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. 14 రోజుల పాటు అమెరికాలో తిరిగి ఐటీ గురించి వివరించి పరిశ్రమలు తీసుకొచ్చాం. పెద్దపెద్ద ఇంజనీరింగ్‌ కాలేజీలు తీసుకొచ్చాం. నా హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఎయిర్‌ పోర్టులకు భూములు ఇచ్చిన వారు సంతృప్తిగా ఉండేలా చేశా. అమరావతికి ల్యాండ్‌ పూలింగ్‌ సాధ్యమవుతుందా అని అనుమానపడ్డాం. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. పదేళ్ల పాటు రైతులకు కౌలు ఇవ్వాలని నిర్ణయించాం. వ్యయసాయ కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్‌ అందించాం…ఈ నెల 1వ తేదీనే దాన్ని రూ.5000కు పెంచి అందించాం. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా సరే అమరావతిని రాజధానిగా ఒప్పుకోవాల్సిందేనని సీఎం చంద్రబాబు అన్నారు.

ఉద్యోగ కల్పన కేంద్రంగా రాజధాని
రోడ్లు, ఇతర నిర్మాణాలకు 27,885 ఎకరాలు, రిటర్నబుల్‌ ప్లాట్ల కింద 11,826, ఇతర అవసరాలకు 14,037 ఎకరాలు పోను ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు భూమి ఉంటుంది. ప్రభుత్వం వద్దనున్న భూమిని విక్రయించి కూడా రాజధాని నిర్మాణం చేయొచ్చని ఆలోచించాం. కేంద్ర ప్రభుత్వం కేపిటెల్‌ గెయిన్‌ మినహాయింపు కూడా ఇచ్చింది. రూ.2,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుని రూ.1500 కోట్లు కూడా అందించింది. రాష్ట్రం నడిమధ్యలో రాజధాని ఉండాలని నాడు అసెంబ్లీలో జగన్‌ అన్నారు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా…మీరు కట్టుకోలేదు అని నన్ను అన్నారు. కానీ తర్వాత ఏం నిర్ణయాలు తీసుకుని ఎలా మాటలు మార్చారో అంతా చూశాం. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జెఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చాయి.

సింగపూర్‌ తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. మొదట సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌, తర్వాత రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ను సింగపూర్‌ అందించింది. నవ నగరాలకు రూపకల్పన చేసి మాస్టర్‌ ప్లాన్‌ అందించారు. దేశంలోనే స్మార్ట్‌ సిటీగా, ప్రపంచ స్థాయి నగరంగా ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్‌ రూపొందించాం. పరిశ్రమలతో పాటు ఉద్యోగాల కల్పన కేంద్రంగా నిర్ణయించాం. నాలెడ్జ్‌ ఎకానమీకి చిరునామాగా ఉండాలని రూపొందించాం. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ తో పాటు అన్ని విభాగాలు ఒక చోట ఉండాలని మాస్టర్‌ ప్లాన్‌ లో నిర్ణయించాం. ఇందులో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. ఏ నగరానికీ పక్కనే నదులు లేవు. కానీ అమరావతికి ఉంది. రెండు నదులను అనుసంధానం చేసే కాన్సెప్ట్‌తో రూపకల్పన చేశాం. రూ.51,687 కోట్లతో రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అంచనా వేసి రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచాం.అప్పటికి జరిగిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించాం…రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండిరగులో ఉన్నాయని సీఎం చంద్రబాబు వివరించారు.

అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభం
2019లో జగన్‌ అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభించారు. కనీసం నిబంధనలు కూడా పాటించకుండా ప్రజావేదికను కూల్చేశారు. తర్వాత మూడు రాజధానులు ప్రకటించారు. జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీ అంటూ ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేశారు. ప్రజావేదిక శిథిóలాలను తొలగించవద్దని ఇప్పుడు అంతా చెబుతున్నారు. అది చూస్తే ప్రతి ఒక్కరిలో గత ప్రభుత్వ విధ్వంసం గుర్తుకురావాలి. 1631 రోజుల పాటు రాజధానికి భూములిచ్చిన రైతులు పోరాటం చేశారు. జగన్‌ నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారు. తిరుపతి యాత్రకు వెళితే ఉండటానికి మండపాలు ఇవ్వకుండా వేధించారు. అరసవెళ్లి యాత్రకు వెళితే దాడులు చేసి మధ్యలోనే నిలిపేయించారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి రాగానే నిర్మాణాలకు గ్రహణం
గత పాలకులు అధికారంలోకి రాగానే రాజధానిలో అన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారు. వ్యవసాయ కూలీలకు అందించాల్సిన పెన్షన్లు, రైతులకు ఇవ్వాల్సిన కౌలు నిలిపేశారు. మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేశారు. రూ.వెయ్యి కోట్లు గ్రాంట్‌ రాకుండా కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేశారు. సింగపూర్‌ కన్సార్టియంపైనా ఆరోపణలు చేశారు. 14 ఎకరాల్లో 12 టవర్లతో నిర్మాణం తలపెట్టిన హ్యాపీ నెస్ట్‌ను నాశనం చేశారు. అది పూర్తైతే ప్రభుత్వానికి రూ.57.37 కోట్లు ఆదాయం వచ్చేది..మున్ముందు రూ.885 కోట్లకు పెరిగేది. కానీ దాన్ని కూడా నాశనం చేయడంతో ఇప్పుడు రూ.164.5 కోట్లు నష్టం. రాజధాని పరిధిలోని రోడ్లు, బిల్డింగులు అన్నీ దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు వివరించారు.

దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్‌
గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసంతో రాజధాని నిర్మాణం ఖర్చు పెరిగింది. రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ బాగా దెబ్బతింది. పెట్టుబడి దారుల్లో నమ్మకం సన్నగిల్లింది. సంపద సృష్టి పెరగలేదు. చిన్నపాటి ఉపాధికి కూడా పక్కరాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది. అన్ని రంగాలు రివర్స్‌ అయ్యాయి. నిధులు ఇవ్వకపోవడంతో సగంలో ఉన్న పనులు పూర్తవ్వలేదు. రెవెన్యూ ఆదాయం తగ్గిపోయింది. చివరకు అమరావతిలో రోడ్లను కూడా వదలకుండా తవ్వుకుపోయారు. ఏపీలో భూముల విలువ కూడా తగ్గిపోయింది. హైకోర్టు, హెచ్‌ఓడీ, సచివాలయాలకు సంబంధించిన ఐకానిక్‌ పునాదులు అన్నీ నీళ్లలో ముంచేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా సర్వీస్‌ అధికారుల భవనాలు పూర్తి చేయలేదు. గెజిటెడ్‌ అధికారులు, మంత్రులు, జడ్జిల కోసం నిర్మించతలపెట్టిన వాటిని కూడా అర్థాంతరంగా నిలిపేశారు. 2019లో ఎక్కడ ఆగిన పనులు ఐదేళ్ల పాటు అక్కడే ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.

జగన్‌ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూడదు
చరిత్ర తలచుకుంటే బాధగా ఉంది. చేసిన కష్టం వృథా అయింది. అది చూస్తే మనసు నిగ్రహించుకోలేని పరిస్థితి. ఇది తెలుగుజాతికి చేసిన ద్రోహం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రం నిలబడాలని పని చేశాం. పదేళ్లుగా రాజధాని లేదు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని వ్యవధి కూడా ముగిసింది. పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయారు. సింగపూర్‌ ప్రతినిధులు వస్తారో రారో తెలీదు. ఈ దుర్మార్గులు మళ్లీ వస్తే తమ పరిస్థితి ఏంటో అన్న ఆలోచనలో పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం మనది. వెయ్యి కి.మీ సముద్ర తీరం ఉంది. ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చి భావితరాల భవిష్యత్తును నాశనం చేశారు. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా.? నన్ను ఇబ్బందులు పెట్టారని నేను మాట్లాడలేదు. జగన్‌ చేసిన విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు.

బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది
రాష్ట్ర అభివృద్ధిపై ప్రజలకు కూడా నమ్మకం రావాలి…అప్పుడే రాష్ట్రం నిలబడుతుంది. గత పాలకులు బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ప్రజా రాజధాని ఏ ఒక్కరి కోసం కాదు. ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన అమరావతి వల్లే సాధ్యం అవుతుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ప్రతి పంచాయతీ సంక్షేమానికి రాజధాని ఒక నిధిలా ఉంటుంది. ప్రతి తెలుగుబిడ్డ గర్వించే ప్రపంచస్థాయి నగరంగా అమరావతి ఉండాలన్న లక్ష్యంతో పని చేశాం. నాది అమరావతి అని చెప్పుకునేలా ప్రణాళిక రూపొందించాం. మాస్టర్‌ ప్లాన్‌ లో మార్పులు లేవు…ఇదే మాస్టర్‌ ప్లాన్‌ ను కొనసాగిస్తాం. ఇక్కడ భూములమ్మిన వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొంటే అక్కడ కూడా విలువ పెరుగుతుంది…సైక్లింగ్‌ విధానం నడుస్తుంది. ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు జరిగి ఉంటే ప్రభుత్వానికి కూడా పన్నులు, జీఎస్టీ రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడ ఏర్పాటైన విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత్‌ లాంటి యూనివర్సిటీల్లో పేద పిల్లలు చదువుకుంటే కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయి. రాజధాని పునర్నిర్మాణంపై కేంద్రంతో కూడా మాట్లాడతాం. అమరావతి ప్రాంతాన్ని ఏ దుష్టశక్తి అడ్డుకోవద్దని వేడుకున్నా…కానీ ఐదేళ్లు ఇబ్బంది పడ్డామని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థలు ఇంత పతనమవడాన్ని ఎప్పుడూ చూడలేదు
రాజధాని పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుండే పనులు ప్రారంభిస్తాం తప్ప…వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. న్యాయ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి సెంటు పట్టాలని డ్రామాలాడారు…ఇల్లు లేని వారికి వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తాం. మా కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాను…కానీ ఎప్పుడూ ఇంతలా వ్యవస్థలు పతనావస్థకు చేరిన సందర్భం చూడలేదు. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌కు కూడా నీళ్లివ్వకుండా గత ప్రభుత్వం వేధించింది. పడకల పెరుగుదలకు అవరోధం ఏర్పడి ఆసుపత్రిలో ఓపీలు కూడా తగ్గాయని సీఎం చంద్రబాబు చెప్పారు.

Tags: అమరావతిఏపీ రాజధాని అమరావతిరాజధానిశ్వేతపత్రం
Previous Post

జగన్‌ కేసులపై రోజువారీ విచారణ

Next Post

పారిశ్రామిక రంగాన్ని జగన్‌ గాలికొదిలేశారు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2025

కార్యకర్త
@ August 17, 2025
చైతన్యరధం ఈ పేపర్ 16-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2025

కార్యకర్త
@ August 16, 2025
హైకోర్టు న్యాయమూర్తులుగా
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
చైతన్యరధం ఈ పేపర్ 15-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-08-2025

కార్యకర్త
@ August 15, 2025
చైతన్యరధం ఈ పేపర్ 14-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2025

కార్యకర్త
@ August 14, 2025
ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం
ఆంధ్రప్రదేశ్

ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

చైతన్యరధం
@ August 14, 2025
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు
ఆంధ్రప్రదేశ్

జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

చైతన్యరధం
@ August 14, 2025
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ
ఆంధ్రప్రదేశ్

జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

చైతన్యరధం
@ August 14, 2025
Load More

ముఖ్య వార్తలు

హైకోర్టు న్యాయమూర్తులుగా

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

చైతన్యరధం
@ August 14, 2025
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

చైతన్యరధం
@ August 14, 2025
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

చైతన్యరధం
@ August 14, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025 6:28 AM

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025 6:35 AM

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

హైకోర్టు న్యాయమూర్తులుగా

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

చైతన్యరధం
@ August 14, 2025
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

చైతన్యరధం
@ August 14, 2025
భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

చైతన్యరధం
@ August 14, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist