- అంతుచూస్తాం..జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు
- చిన్న పిల్లల మధ్య చిచ్చు పెడుతున్నారు
- అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా?
- ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుండాలి
- హద్దులు దాటి మాట్లాడితే మీ పరిస్థితి ఏంటి?
- అమరజీవి జలధార శంకుస్థాపనలో పవన్కళ్యాణ్
నిడదవోలు(చైతన్యరథం): మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తామని కొంతమంది వైసీపీ నాయకులు బహిరం గంగా బెదిరిస్తున్నారు..పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతా మంటున్నారు..వారందరికీ ఒకటే చెబుతున్నాం.. మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్..బెదిరింపులకు దిగే కిరాయి రౌడీల కు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్కళ్యా ణ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం చాలా సహజం. ఆ విమర్శలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా ఉండాలి.. గీతదాటి మాట్లాడతాం అంటే చేతిలో గీతలు మాయమయ్యేలా చేస్తాం. కొంతమంది నాయకులు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పిఠాపురంలో చిన్న పిల్లల మధ్య సామాజికవర్గాల పేరిట చిచ్చు పెట్టారు. పిల్లలకు కులాలు అంతగట్టడం సరికాదు.. ఇది రాజకీయం అనిపించుకోదు. అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? రాజకీయం చేయడానికి వేరే దారులే లేవా? ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు.
తూర్పుగోదా వరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో ‘‘అమరజీవి జలధార’’ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి జలధార’’ ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో రూ. 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో రూ.1.21 కోట్ల మంది దాహార్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తీరప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు.
తెలుగుజాతి కోసం కూటమిగా ఏకమయ్యాం
తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన పొట్టి శ్రీరాము లును సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ‘‘అమరజీవి జలధార’’గా నామకరణం చేశాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను తగ్గాను కనుకే పల్లెపండగ 1.0 కార్యక్రమం చేయగలిగాం. 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయగలిగాం. లక్ష ఫామ్ పాండ్లు, 22,500 మినీ గోకులాలు నిర్మించగలిగాం. 10 వేల ఎకరాల ఉద్యానవన పంటలకు చేయూత ఇవ్వగలిగాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కార ణంగా 2024లో జల్ జీవన్ మిషన్ గడువు ముగిసేనాటికి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడాల్సిన వేల కోట్ల నిధులు నిరుపయోగంగా మిగిలిపోయాయి. పథకం గడువు ముగియడంతో ఆ నిధులు మురిగిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, తాను ఢల్లీి వెళ్లి కేంద్రంలో ఉన్న పెద్దలతో చర్చించి జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు గడువు పొడిగించేందుకు ఒప్పించాం.
ఈ రోజు రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు తీసుకువస్తున్నామంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన సంపూర్ణ సహకారంతో చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ల గలుగుతున్నాం. రోడ్ల నిర్మాణంలో, అమరజీవి జలధార కార్యక్ర మం ద్వారా జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుగు వారికి ఉనికి ఇచ్చిన నాయకుడు పొట్టి రాములు..తెలుగుజాతి అని సగర్వంగా చెప్పుకునేలా చేసిన వ్యక్తి..నాయకులకు కులం అంటగ ట్టొద్దు..మహానుభావుల స్ఫూర్తిని నేటి తరం, భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని కోరారు. రాష్ట్రానికి మంచి జరగాలనే అన్ని విషయాల్లో తగ్గాను. గోదావరి నది పారుతున్నా కూడా ఇక్కడి వాసులకు మంచి నీరు లేకపోవడం బాధాకరం.. అందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. యోగీ ఆదిత్యనాథ్ తరహా విధానాలు అవలంభిస్తే అన్ని సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో చెత్త వాగుడు వాగితే చూస్తూ ఊరుకోమని అన్నారు. సమాజం, రాష్ట్రం, ప్రజల మీద కమిట్మెంట్తో ఉన్నాం. చనిపోయే ముందు చాలా మంది తాట తీసే పోతా..ధైర్యం లేని సమాజం, నాయకులెందుకు..అమరజీవి జలధార ఒక్క కులానికి సంబంధించిన ప్రాజెక్ట్ కాదు..ఇది అందరిదీ. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని తెలిపారు.















