అమరావతి(చైతన్యరథం): యోగాంధ్ర, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జూన్ 21న జరిగే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సోమవారం రాష్ట్రమంతటా అన్ని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలలో ర్యాలీలు నిర్వ హించాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. అన్ని గ్రామాలు, మండలాలలో ర్యాలీలు విజయవంతంగా నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి, మండలస్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లకు తెలిపారు. గ్రామ వార్డు స్థాయి నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతి నిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.