- వాళ్లు మారలేదు..మారరు కూడా..
- సైకో పార్టీ..సైకో నాయకుడు
- వికృత చేష్టలను ప్రజలు గమనించాలి
- మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం
- ఇబ్రహీంపట్నం ఘటనపై మండిపాటు
ఆమరావతి(చైతన్యరథం): ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తల పైశాచికత్వంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు తిరస్కరించినా వాళ్ల తీరు మారలే దు.. మైలవరంలో మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి.. వాళ్లు చేసిన పిచ్చి చేష్టల ను తీవ్రంగా ఖండిస్తున్నా. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట శుభకార్యానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఆ మార్గంలో వెళుతున్న ఓ బాలుడి సైకిల్ లాక్కుని దారుణంగా ప్రవర్తించారు. సైకిల్ను గాల్లో తిప్పి నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కుతూ పైశా చిక ఆనందం పొందారు. ఓ పక్క ఆ పిల్లాడు. ఏడుస్తున్నా పట్టించుకోకుండా దుశ్చర్యకు పాల్పడ్డారు..అంటూ దీనిపై ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘అబ్బే.. వాళ్లేమీ మారలేదు.. మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికీ.. నేటికీ.. ఎప్పటికీ ఆదో సైకో పార్టీ.. వాళ్లకి సైకో నాయకుడు. ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ల ఆలోచనలను, చిన్న పిల్లవాడి చేతి నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ, విరగ్గొడుతూ చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్థం చేసుకోవాలని ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను’’ అని లోకేశ్ పేర్కొన్నారు.