- గురువుల పట్ల నీతిబాహ్యమైన చర్యలు
- వేరే రాష్ట్రంలో జరిగిన సంఘటన ఫొటోతో ఫేక్ ప్రచారం
- పదేపదే అదే తప్పు చేస్తున్న సైకో పార్టీ
- మంత్రి లోకేష్ మండిపాటు
- తగిన బుద్ధి చెప్పాలని టీచర్లకు వినతి
అమరావతి (చైతన్యరథం): ఎంతో బాధ్యతాయుతంగా పని చేస్తూ విద్యార్ధులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అతి నీచంగా చిత్రీకరిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న వైసీపీ చర్యల్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. ఫేక్ హ్యాండిల్స్ ద్వారా ఫేక్ విషయాలను ప్రచారం చేసే వైసీపీ చర్యల్ని అర్థం చేసుకుని తగిన రీతిలో స్పందించాల్సిందిగా టీచర్లను కూడా కోరుతున్నానన్నారు. వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైసీపీ తన ఫేక్ హ్యాండిల్ లో ఒక ఫొటోను షేర్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్న టీచర్లు మద్యం తాగి బెంచీల కింద పడుకుంటున్నారన్న రీతిలో అతి జుగుప్సాకరంగా అందులో వ్యాఖ్యానం ఉంది. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చిన ఫొటోను ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు చెప్పడం, దానిపై దారుణంగా వ్యాఖ్యానించడం క్షమించరాని నేరం. ఇలాంటి నేరాలను ఇప్పటికే చాలా సార్లు వైసీపీ పాల్పడిరది. విద్యా నేర్పే గురువుల పట్ల కూడా అతి నీచంగా వ్యవహరించిన వైసీపీ నీతిబాహ్యమైన చర్యల్లో మరో మెట్టు కిందికి దిగజారిందని మంత్రి లోకేష్ మండిపడ్డారు.









