అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టెమ్ కోర్సు మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు. స్టెమ్ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ అనంతర పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత ‘వర్క్ ఫ్రమ్ హోం ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయన్నారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ ఛేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడిరచారు. ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అందుకుతగ్గ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. అట్టడుగుస్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు ఐటీ, జీసీసీ సంస్థలకు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమాలు ఎక్కువ శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడిరచారు.