- నమో అంటే విక్టరీ, ఏది తలపెట్టినా విజయమే
- మోదీ 3సార్లు ప్రధాని కాబట్టే
- 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
- ఆంధ్రప్రదేశకు అన్నివిధాలా ప్రధాని మోదీ సహకారం
- డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీలో అభివృద్ధి పరుగులు
- జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8వేల కోట్ల లబ్ధి
- కర్నూలు సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ సభలో మంత్రి లోకేష్
కర్నూలు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ అన్నా, ఇక్కడి ప్రజలు అన్నా ప్రధాని మోదీకి అపారమైన ప్రేమ.. 16నెలల్లో నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చారు.. మనం అడిగిన అన్ని కోరికలు తీరుస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నంబర్ 1 కావాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం.. గుజరాత్లో ప్రభుత్వ కొనసాగింపు వల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో గురువారం జరిగిన బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిధిగా హాజరుకాగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు అనేది ముఖ్యం అని ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు ప్రధాని కావడం వల్లే ప్రపంచంలో 10వ స్థానం నుంచి 4వ అతి పెద్ద ఎకానమీగా భారత్ అభివృద్ధి చెందింది. సంక్షేమం అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి లాంటివి. కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఏపీ అన్ని రంగాల్లో నంబర్ 1 కావడం ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఏపీ అన్ని రంగాల్లో నంబర్ 1 కావడం గ్యారంటీ. పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ పవర్ ప్లేసెస్. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళను గడగడ లాడించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి, ముత్తుకూరు గౌడప్ప జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు అని మంత్రి లోకేస్ అభివర్ణించారు.
పేద ప్రజల ఆనందమే ప్రధానికి ముఖ్యం
సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ తో దసరా, దీపావళి కలిపి ఒకేసారి వచ్చినట్లుగా ఉంది. అలాంటి సూపర్ పండుగను 140 కోట్ల ప్రజలకు అందించారు మన ప్రధాని నమో. పేద, మధ్య తరగతి ప్రజల పై పన్నుల భారం తగ్గించారు. ట్యాక్స్ తగ్గడం వలన ఒక్కో పేద, మధ్య తరగతి కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు మిగులుతుంది. జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు దేశానికి లాభం జరుగుతుందని నమో అన్నారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం… ఇలా పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువుపై జీఎస్టీ తగ్గించారు. జీఎస్టీ తగ్గడంతో ప్రజలు పండగ చేసుకుంటున్నారు. పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండగ. పేద ప్రజల ఆనందమే మన నమోకి పండగ. పేదరికం లేని దేశమే మన నమో కల. జీఎస్టీ తగ్గించాలని ప్రధాని నిర్ణయం తీసుకున్న తరువాత మన ఆర్థికమంత్రి కేశవ్ వచ్చి దాదాపు రూ.8 వేల కోట్లు నష్టపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు … పేద ప్రజలకు రూ.8 వేల కోట్ల లాభం జరుగుతుంది కదా అని సీఎం అన్నారు. నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే, దానికి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని మంత్రి లోకేష్ వివరించారు.
ప్రధాని సాయంతోనే..
కేంద్రంలో మన నమో రాష్ట్రంలో మన సీబీఎన్. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్. ప్రధాని సహాయంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. విశాఖ లో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. పోలవరం పనులు వేగవంతం అయ్యాయి. అమరావతి పనులు వేగంగా జరగడానికి, కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరిస్తున్నారు. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యమని కంపెనీ వాళ్లను కోరినప్పుడు వాళ్లు మాకు మూడు అంశాల్లో క్లారిటీ కావాలని అడిగారు. మన ముఖ్యమంత్రి వెంటనే ప్రధానిని కలిసి చెప్పిన వెంటనే ఆయన దానికి అంగీకరించారు. నమో సహకారం వల్లే భారత్లో అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. గూగుల్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోంది. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ అని మంత్రి లోకేష్ అన్నారు.
నమో ఏది తలపెట్టినా విజయమే
నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత దేశానికి ప్రధానిగా ప్రభుత్వాధినేతగా నమో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదు. 25 ఏళ్లు అధికారంలో ఉన్నా మన నమో మొదటి రోజు ఎంత కష్టపడ్డారో ఇప్పటికీ అంతే హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. గుజరాత్ను పవర్ ఫుల్ స్టేట్ గా మార్చారు. ఇప్పుడు భారత దేశాన్ని సూపర్ పవర్ గా మారుస్తున్నారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు. మన దేశ ప్రభుత్వాలు యూఎన్ దగ్గరకో, ఇతర దేశాల దగ్గరకో వెళ్లి సాయం కోరేవారు. మన నమో రూటే సెపరేటు. పెహల్గావ్లో నమో కొట్టిన దెబ్బకి పాకిస్థాన్ దిమ్మ తిరిగిపోయింది. అమెరికా ట్యాక్సులు పెంచితే పెద్ద పెద్ద దేశాలు కూడా వణికిపోయాయి. నమో ఆత్మనిర్బర్ భారత్ వంటి కార్యక్రమాలతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. నమోకి దేశ ప్రజలు అంటే నమ్మకం.. మనకి నమో అంటే నమ్మకం. ఆ నమ్మకమే దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.