- ప్రజాతీర్పుతో పిచ్చెక్కి మాట్లాడుతున్నావా?
- ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తావా?
- కులాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడతావా?
- ఇద్దరు చనిపోతే పరామర్శించలేదేం
- ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు పాలన
- కాబట్టే జగన్ బయట తిరుగుతున్నాడు
- అలుసుగా తీసుకుంటే రోడ్డెక్కలేవ్
- గత ఐదేళ్లూ ఏమి చేశావో చర్చకు సిద్ధమా?
- రేపో, ఎల్లుండో జైలుకు వెళ్లక తప్పదు
- ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు? రౌడీలు, గుండాలు, గంజాయి బ్యాచ్లను వెనకేసుకొస్తూ తలలు నరికితే తప్పేంటంటావా? ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్లో టీవీలు పగులకొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావా? ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిం చేలా వ్యవహరిస్తావా? ఖబడ్దార్ జగన్రెడ్డి..కపట నాటకాలు కట్టిపెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో జగన్రెడ్డి తీరును దుయ్యబట్టారు. గత ఐదేళ్లు ఒక నియంతలా పరిపాలించి.. నేడు మళ్లీ అధికారం కోసం కులాలు, మతాలు, ప్రజలు, ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడతావా? అసలు ప్రజా స్వామ్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఉందా? నువ్వు గెలుస్తావని బెట్టింగ్ పెట్టి ఆ డబ్బులు కట్టలేక నాగమల్లేశ్వ రరావు ఆత్మహత్య చేసుకుంటే ఏడాది తరువాత పరామర్శకు వెళ్లి.. మరో ఇద్దరి చావుతో శవరాజకీయాలు చేస్తున్న నీవు.. దమ్ముంటే చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
గత ఐదేళ్లూ నువ్వు ఏమీ చేయలేదని చెప్పడానికి నేను సిద్ధమని సవాల్ విసిరారు. అధికా రం కోల్పోవడంతో జగన్కు మతి భ్రమించినట్లుంది. ఎర్రగడ్డలోనే, విశాఖ మానసిక ఆస్పత్రిలోనే చికిత్స చేయించాల్సి ఉంది. అసెం బ్లీకి రాకుండా, ప్రజల సమస్యలపై మాట్లాడకుండా.. కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటనలు చేస్తున్నాడు. రౌడీ మూకలు, గంజాయి మూకలను వెనకేసుకేసుకొస్తున్నాడు. వారి పరామర్శలకు వెళ్తున్నాడు. సత్తెనపల్లి పర్యటనకు 100 మందికి పర్మిషన్ ఉంటే వేలమందిని పోగేసి ఏ విధంగా నినాదాలు ఇప్పించాడో మనం చూశాం. తక్షణమే అధికారం కావాలి..ముఖ్య మంత్రి సీట్లో కూర్చోవాలి.. అరాచకం సృష్టించాలి.. అవినీతితో దోచుకోవాలనే లక్ష్యంతోనే జగన్రెడ్డి వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.
శాంతిభద్రతలకు విఘాతం
అభివృద్ధి సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. ప్రజా స్వామ్య హక్కులకు ఎక్కడా భంగం కలించకుండా కూటమి ప్రభు త్వం పాలన చేస్తుంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆభాసు పాలుచేయాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా అరాచకం, ఆటవికం, పోలీసులు, ప్రజల మీద దాష్టీకాలకు పాల్పడుతున్నాడు. నిన్న జరిగిన పర్యటనలో ఇద్దరు మరణిస్తే కనీసం వారిని పరామర్శించ డానికి కూడా వెళ్లలేదు. కూటమి ప్రభుత్వం రాక ముందు జరిగిన సంఘటనను తీసుకువచ్చి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. తన సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేయించు కోవడానికి జగన్ రెడ్డి పడుతున్న తిప్పలు అందరూ చూస్తున్నారు. పరిటాల రవి హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రజా స్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలతో ముందుకు వెళ్తున్న జగన్కు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్న మైందన్నారు.
ఐదేళ్లూ రైతులకు ఏమి చేశావ్?
దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా న్యాయ వ్యవస్థను కూడా దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా అలజడి సృష్టిస్తున్నా డు. అసలు గత ఐదేళ్లు రైతులకు ఏం చేశాడని జగన రెడ్డి పొగాకు రైతుల పరామర్శకు వెళ్లాడు? నీటిపారుదల వ్యవస్థను నాశనం చేశాడు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వులేదు. కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు? బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం ముసు గులో అప్పులు తెచ్చి దోచుకోవడం తప్ప జగన్ చేసింది ఏమీ లేదు. తన అధికార దాహం కోసం రౌడీ మూకలను వెంటేసుకుని అలజడులు సృష్టిస్తున్నాడు. ఇదే విధానం కొనసాగితే ఎలా కట్టడి చేయాలో మాకు తెలుసు. కులాల పేరుతో మతాల పేరుతో విభ జించు పాలించు విధానంతో రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి ఇష్టారాజ్యంగా సాగుతామంటే కుదరదని హితవుపలికారు. మా ఓపిక నసించి మా కార్యకర్తలు తిరగబడితే వైసీపీ మూకల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. మేము రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపా లన చేస్తున్నాం. జగన్రెడ్డి చేసిన తప్పొప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఏం చేశాడని జగన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేయాలి? ఏ సమస్యపైన అయినా స్పందించాడా? ఒక్క ఉద్యోగమై నా ఇచ్చాడా? ఎవరికైనా ఉపాధి కల్పించాడా? ఐదేళ్లలో చేసింది ఒక్కటి లేదు.. ఉత్తుత్తి బటన్లు నొక్కడం తప్ప అని ధ్వజమెత్తారు.
జగన్రెడ్డి ఒక దోపిడీదారు, పచ్చి దొంగ, ఛీటర్
151 మందితో ప్రజలు అధికారం ఇస్తే, అరాచకం, ముఠా రాజకీయాలు చేశాడు, అవినీతి అక్రమాలను పెంచి పోషించాడు. లిక్కర్ స్కామ్లు, మైనింగ్ స్కామ్లు, ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోచుకున్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి తప్పుడు కేసులతో మా నాయకులను జైల్లో పెట్టారు. ప్రజాస్వామ్యా న్ని, హక్కులను అణచివేశారు. ఉద్యోగులతో పాటు అందరిని మోసం, దగా చేశాడు. జగన్రెడ్డి వల్లే అనేకమంది దివాళా తీసిపో యారు..అప్పుల పాలయ్యారు..ఆత్మహత్యలు చేసుకున్నారు. దోపిడీ ఏదైనా ఉంటే తాను తన అనుచరులు మాత్రమే దోచుకున్నారు. జగన్రెడ్డి ఒక దోపిడీదారు, పచ్చి దొంగ, ప్రజలను మోసం చేసిన 420 ఛీటర్. ఇలాంటి జగన్ మళ్లీ లిక్కర్ స్కాం నిందితులు, ఎర్రచెందనం దొంగలు, మైనింగ్ దోపిడీదారులను మంచి వారం టున్నాడు. జగన్రెడ్డి విధానం సరైనది కాదు. ప్రపంచ యోగాడేను ఘనం నిర్వహించేందుకు ప్రభుత్వం యత్నిస్తుంటే ఎలాగైనా అలజడులు సృష్టించేందుకు జగన్ యత్నిస్తున్నాడు. పెట్టుబడు లను అడ్డుకుంటున్నాడు. ఎవరైనా రాష్ట్రానికి ఆర్థికసాయం చేస్తా నంటే ముందుకు రావద్దంటున్నాడు. జగన్రెడ్డి బ్రతుకే అబద్దాల బతుకు, అరాచకాలు అక్రమాలకు కేంద్ర బిందువు. జగన్రెడ్డి ఆటలు ఇక సాగనివ్వం.
కఠినంగా వ్యవహరిస్తే, జగన్రెడ్డి బయ ట తిరగలేడు.. గత ఐదేళ్లు ఒక నియంతలా పరిపాలించి, నేడు మళ్లీ అధికారంకోసం యత్నిస్తున్నాడు. రౌడీ గ్యాంగ్, గంజాయి గ్యాంగ్లను రెచ్చగొడుతున్నాడు. కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ అమలు చేస్తుంది. ఎంతమంది ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం, పింఛన్ ఇచ్చాం. రైతులను ఆదుకుంటున్నాం, ధాన్యం కొన్న వెం టనే డబ్బులు ఇస్తున్నాం. నాడు జగన్రెడ్డి ఎందుకు ఇవ్వలేదు? జగన్రెడ్డి చేసిన అప్పులు పెనుభారమై.. ఆ అప్పులు తీర్చడానికే ప్రభుత్వానికి సమయం సరిపోతుంది. లక్షల ఎకరాలు దోపిడీ చేసి తన అనుంగులకు కట్టబెట్టాడు. దానిపై విచారణ జరుగు తోంది. న్యాయం త్వరలోనే రుజువవుతుంది. రేపో ఎల్లుండో ఏ చంచల్గూడ జైలుకో, రాజమండ్రి జైలుకో జగన్ వెళ్లకు తప్ప దు. ప్రజలు అరాచక వ్యక్తులు చేస్తున్న విధ్వంసాలకు దూరంగా ఉండాలని సూచించారు.