- తెనాలిలో పిచ్చివాడిలా మాట్లాడిన జగన్ రెడ్డి
- కరడుగట్టిన నేరగాళ్లు చిన్నపిల్లలు, అమాయకులా
- చంద్రబాబు గురించి మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి
అమరావతి (చైతన్యరథం): జగన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. గంజాయి బ్యాచ్ని, పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేసిన నేరగాళ్లను, మహిళలపై అత్యాచారాలు క్రిమినల్స్నుద్దేశించి చిన్న పిల్లకాయలని చెప్పటం జగన్కే చెల్లిందన్నారు. కరడు గట్టిన నేరగాళ్లను పరామర్శించేందుకు వెళ్లటమే కాకుండా వాళ్లు అమాయకులని చెప్పటం జగన్ దిగజారుడుతనాన్ని వెల్లడిస్తోందని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆనం రమణారెడ్డి మాట్లాడుతూ నేరగాళ్ల పరామర్శకు తెనాలి వెళ్లిన జగన్ రెడ్డి.. అక్కడ సీఎం చంద్రబాబు గురించి అవాకులు, చెవాకులు పేలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా రావాలన్నారు.
మా అధినేతను నడిరోడ్డుపై కొట్టాలన్న నిన్ను దేనితో కొట్టాలి. 31 కేసులు ఉండి విచారణకు వెళ్లకుండా వాయిదాలతో తప్పించుకుంటున్న నిన్ను దేనితో కొట్టాలి.. చెప్పుతో కొట్టాలా.. అని జగన్ పై మండిపడ్డారు. జగన్ రెడ్డి ఓడిపోయి సంవత్సరం దాటింది. సరైన మందులు వాడుతూ పిచ్చి ముదిరేది కాదు. ఇప్పుడు పిచ్చి ఎక్కువై ఏదేదో మాట్లాడుతున్నాడు. తెనాలిలో ముగ్గురు నేరగాళ్లపై పెట్టినవి దొంగ కేసులు అంటున్నాడు. వారిమీద కొన్ని కేసులు జగన్ హయాంలోనే పెట్టారు. వారికోసం జగన్ రెడ్డి తెనాలి వెళ్లినప్పుడు అక్కడి జనం జగన్ను ఛీ కొట్టారు. అసలు జగన్ రెడ్డికి సిగ్గుందా? ఇంగిత జ్ఞానం ఉందా? అమ్మాయిలను రేప్ చేసినోడిని, పోలీస్ కానిస్టేబుల్ పై హత్యయత్నం చేసిన వాన్ని పరామర్శిస్తాడా? విద్యార్థి మీద హత్యప్రయత్నం చేసినవాడిని వెళ్లి పరామర్శిస్తాడా? వైసీపీ కార్యకర్తలకు జగన్ రెడ్డి నేర్పే విలువలు ఇవేనా? మీరు నేరాలు చేయండి.. జైలుకు వెళితే నేను వచ్చి పరామర్శిస్తా అని చెబుతున్నాడా? సంఘ విద్రోహ పనులు చేస్తూ మళ్లీ పోలీసుల మీద విమర్శలు చేస్తారా? హత్యాయత్నం, రేపులు చేస్తే పోలీసులు ఊరుకోవాలా? ఆ పార్టీ నాయకులు కూడా జగన్ మాదిరిగానే తయారయ్యారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో పోలీసులపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చాలా దురుసుగా ప్రవర్తించాడు. పళ్లు కొరుకుతూ బెదిరించాడు. పళ్ళు ఊడగొడతారు జాగ్రత్త. జగన్ ఒక దొంగ. ఆయన చుట్టూ ఉండే బ్యాచ్ అంతా దొంగ బ్యాచే అని ఆనం దుయ్యబట్టారు.
జగన్ పెట్టిన తప్పుడు కేసులే..
చంద్రబాబును రోడ్డుపై కొట్టాలన్న జగన్ వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలి. జగన్ మీద 31 కేసులు ఉన్నాయి. అందులో ఈడీ కేసులు 7 , సీబీఐ కేసులు 11. అంతే కాకుండా 3,452 సార్లు కోర్టు వాయిదాలు తీసుకున్నావు. ఇది ఒక వరల్డ్ రికార్డు. హరీష్ సాల్వే, అభిషేక్ సాంఫ్వీు, ముకుల్ రోహత్గీ లాంటి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని జైల్కు వెళ్లకుండా తప్పించుకొని.. దశాబ్దం దాటినా ఈ రోజుకు కూడా కేసులు విచారణకు రాకుండా మేనేజ్ చేస్తున్నావు. ఒక్కొక్క లాయర్కు గంటకు రూ.12 నుండి 25 లక్షల వరకు ఫీజులు చెల్లిస్తున్నావు. యావరేజ్గా లీగల్ ఫీజుల కోసమే జగన్ రెడ్డి రూ. 6,904 కోట్లు ఖర్చు పెట్టాడు. జగన్ రెడ్డి కేసులు మొదలై 5వేల రోజులు అయింది. ఇంత వరకూ ఒక్క కేసులో కూడా విచారణ మొదలు కాలేదు. జగన్రెడ్డికి దమ్ముంటే కోర్టుకు వెళ్లి తన కేసులపై విచారణ జరిపించుకుని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి.
తన కేసులపై విచారణ పూర్తి చేయమని కోర్టును కోరే ధైర్యం లేని జగన్కు.. తెలుగుదేశం పార్టీ గురించి కాని, పార్టీ విధానాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఇన్ని కేసులు పెట్టుకొని, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్న జగన్ రెడ్డి చంద్రబాబును రోడ్డుమీద కొట్టాలంటూ మాట్లాడటానికి సిగ్గుండాలి. చంద్రబాబు మీద ఉన్న కేసులన్నీ జగన్రెడ్డి పెట్టిన తప్పుడు కేసులే. పేదలకు ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, పుంగనూరుకు బాబు వెళ్లినప్పుడు ఒక కేసు, పబ్లిక్ మీటింగ్లో జనాలను ఇబ్బంది పెట్టారని ఒక కేసు, లౌడ్ స్పీకర్లు వాడారని ఒక కేసు, కరోనాపై సోషల్ మీడియాలో అవగాహన కల్పించిన దానికి ఒక కేసు పెట్టారు. ఇలా అన్ని దొంగ కేసులు పెట్టి మళ్లీ చంద్రబాబు గురించి మాట్లాడుతారా? జగన్రెడ్డి నీతి, నిజాయితీల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆనం మండిపడ్డారు.
విచారణ కోసం అడుగు
ఇక జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల్లో అరెస్టయిన వారందరూ పోలీసులు విచారణలో ఏదడిగినా గుర్తు లేదు, తెలియదు, మర్చి పోయాము అని సాకులు చెబుతున్నారు. మరి జగన్ కేసులన్నీ 2004`2009 మధ్య జరిగినవే. ఇన్ని సంవత్సరాలయినా నీ కేసులు విచారణకు రావటం లేదు. ఇంకా ఎన్ని రోజులు కావాలి? ఎంతమంది హైకోర్టు జడ్జీలు మారారు, ఎంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు మారారు? నువ్వు మొగాడివి అయితే.. వాయిదాలు వద్దు.. విచారణ జరిపి ఆరు నెలల్లో నా కేసు తీర్పు ఇవ్వండి అని అడుగు. దీనికి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. నీ కేసులు తేల్చుకునే దమ్ము లేదు కాని మళ్లీ మా గురించి మాట్లాడుతావా? సీఎం చంద్రబాబు గురించి, మంత్రి లోకేష్ గురించి మాట్లాడేప్పుడు ముందు నీకేసులు గురించి తేల్చుకుని రా. నీ కేసుల్లో విచారణ జరపమని అడిగే దమ్ము, ధైర్యం లేని జగన్ రెడ్డికి టీడీపీ గురించి మాట్లాడే హక్కు లేదని ఆనం రమణారెడ్డి స్పష్టం చేశారు.