- పెద్ద కంపెనీలతో రాష్ట్రానికి పెట్టుబడులు
- యువతకు ఉద్యోగావకాశాలు రాకూడదా?
- సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను
- ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఉంది
- సాక్షిపై కేసులో న్యాయం తన వైపే ఉంది
- ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ పోర్టా అన్నారు
- భోగాపురంలో విమానం ల్యాండ్ అయింది
- చట్టబద్ధత వల్లే అమరావతిని తరలించలేకపోయారు
- ఆర్థిక ప్రాంతాలుగా అమరావతి, విశాఖ, తిరుపతి
- వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తా
- మీడియా సమావేశంలో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం(చైతన్యరథం): తక్కువ ధరకు భూములిస్తే తప్పేం టి..పెద్ద కంపెనీలతో రాష్ట్రానికి పెట్టుబడులు..యువతకు ఉద్యోగా వకాశాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో వాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. సాక్షి పత్రికపై వేసిన పరువునష్టం కేసులో న్యాయం నా వైపు ఉంది, తప్పకుండా గెలుస్తానని తెలిపారు. తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం కేసులో బుధవారం విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్కు లోకేష్ హాజరయ్యా రు. క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసిన అనంతరం విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. 2019లో ఆనాడు టీడీపీ ఓడిపోయినప్పుడు కుట్రపూరితంగా తప్పుడు వార్తలు రాసి, వ్యక్తిగతంగా నా పరువుకు భంగం కలిగించాలని నా ఫొటో పెట్టి, కింద క్యారికేచర్ పెట్టి అసత్య కథనం ప్రచురించారు. నేను విశాఖకు వచ్చినప్పుడు ఐదేళ్లలో ఎయిర్ పోర్ట్ లాంజ్లో స్నాక్స్కు రూ.25 లక్షలు ఖర్చు పెట్టానని రాశారు. ‘చినబాబు చిరుతిండికి 25 లక్షలండి’ అనే టైటిల్తో ఏకంగా నా ఫొటో పెట్టి ఆర్టికల్ రాశారు. ఆ రోజు నుంచే నేను సాక్షిపై పోరాటం మొదలుపెట్టాను. రాసేప్పుడు నిజానిజాలు నిర్ధారించుకోవాలి. ఆ రోజు ద వీక్ అనే మేగజైన్ కూడా ఆర్టికల్ రాసినప్పుడు నోటీసులు పంపాను. ఏ తేదీలు అయి తే ప్రచురించారో ఆ తేదీల్లో నేను విశాఖలో లేనని ఆధారాలతో సహా నిరూపించాను. అది తెలుసుకుని వారు రీజాయిండర్ వేసి, క్షమాపణలు కూడా కోరారని తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మనపై ఉంది
2014-19 మధ్య లేదా ఇప్పుడు నేను విశాఖకు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ కూడా తీసుకోవడం లేదు, గెస్ట్ హౌస్లో కూడా నేను ఉండటం లేదు. నేను వినియోగించే రెండు వాహనా లు కూడా ప్రభుత్వ వాహనాలు కావు. వాటి డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్, కాఫీ ఖర్చు కూడా నాదే. ఎయిర్ పోర్ట్ లాంజ్లో నాయకులతో ఐదు నిమిషాలు మాట్లాడాలంటే కాఫీ, కాఫీ పౌడర్, చివరకు మగ్గు కూడా నాదే. ఇది మా అమ్మ గారు నాకు నేర్పించిన సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు పవిత్రమైన బాధ్యత మనపై పెట్టారు. వారు ఏ నమ్మకంతో మనల్ని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఏ ఖర్చులు ఉన్నా కుటుంబపరంగా మేం భరిస్తాం. ఇంట్లో అమ్మ, బ్రాహ్మణి సంపాదిస్తే.. చంద్రబాబు, నేను ఖర్చుపెడుతున్నాం. తన క్రెడిట్ కార్డు బిల్లు కూడా బ్రాహ్మణి కడు తున్నారు. పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో మేం చేస్తున్నాం. నేను ఎప్పుడు విశాఖకు వచ్చినా టీడీపీ కార్యాలయంలోనే బస చేస్తున్నాను. కార్యకర్తలను కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికైనా వెళ్లడం జరుగుతుందని తెలిపారు.
ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను
క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకు నేను రాజ కీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. దీనిపై పోరాడాలని ఆనాడే నిర్ణయించు కున్నా. రెండు కాదు, ఐదు కాదు.. మరో ఏడాది గడిచినా న్యాయం నావైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నమ్ముతున్నాను. నేను ఏనాడూ తప్పు చేయలేదు, చేయను, చేయబోను. సాక్షపై పరువునష్టం కేసులో నా ఎగ్జామినేషన్ ఈ రోజుతో పూర్తయింది. ఈ సారి వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను.
విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడవాలని కోరుకుంటున్నాం
విశాఖ ఎకనమిక్ రీజియన్ కోసం స్టీల్ ప్లాంట్ భూములు తీసుకుంటున్నామనేదే ఆరోపణ మాత్రమే. దీనిపై ప్రభుత్వం నుంచి ఎవరూ ప్రకటన చేయలేదు. విశాఖ స్టీల్ కోసం రూ.14 వేల కోట్లు ఖర్చుచేయడం జరిగింది. మూడో బాయిలర్ కూడా మేం యాక్టివేట్ చేశాం. ఫుల్ ప్రొడక్షన్ కు మేం తీసుకువచ్చాం. గతంలో కూడా ఇదే పరిస్థితి వస్తే వాజ్పేయి, చంద్రబాబు గారు కలిసి విశాఖ ఉక్కును కాపాడారు. ఈ రోజు మోదీ, చంద్రబాబు కలిసి విశాఖ ఉక్కును కాపాడుతున్నారు. అపోహలు అవసరం లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, జరగనివ్వం. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్లో నడవాలని మేం అందరం కోరుకుం టున్నాం. పదేపదే బెయిల్ అవుట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రాఫిట్లో నడవాలి. ఇందుకు అందరూ సహకరించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన భూమిని ఇతర అవసరాలకు డైవర్ట్ చేయాలనే ఆలోచన ఎన్డీయే ప్రభుత్వానికి లేదు. సీపీఎం సోదరులకు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వారే దానికి సమా ధానం చెబితే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్టా అన్నారు..
భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో క్రెడిట్ కోసం ఇక్కడ మేం ఎవరం పోరాడటం లేదు. పనిచేసేందుకు, ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు మేం అహర్నిశలు కష్టపడు తు న్నాం. ఇదే జగన్రెడ్డి ఆనాడు ఏం చెప్పారో గుర్తుచేసుకోవాలి. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అని జగన్రెడ్డి ఆనాడు అన్నారా, లేదా? ఇందుకు సంబంధించిన వీడియోను అందరూ చూశారు. ఆనాడు జీఎంఆర్కు సుమారు 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్నడిగితే అది ఇంకా తక్కువ. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్కు 5 వేల ఎకరాలు ఇచ్చారు. ఆనాడు ఇదే పెద్దమనుషులు ఎయిర్ పోర్ట్కు 5 వేల ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. ఈ రోజు బెంగళూరు పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక విజన్ తో చంద్రబాబు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి జీఎంఆర్కు ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నారు. సుమారు 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిని తిరిగి వెనక్కి ఇచ్చాం. ఎయిర్పోర్ట్ అంటే లార్జర్ ఎకో సిస్టమ్ అవసరం. ఎంఆర్, ఇంజన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్ లాంటి ఎకో సిస్టమ్ అవసరం. ఇవన్నీ ఏర్పాటుచేస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించగలం. అశోక్గజపతిరాజు దయవల్ల మాన్సాస్తో ఒప్పందం చేసుకుని వరల్డ్ క్లాస్ ఏవియేషన్ సిటీని జీఎంఆర్ అభివృద్ధి చేస్తోంది. క్రెడిట్ కావాలంటే వైసీపీ తీసుకోవచ్చు. అది నో ఇష్యూ. దాంతో పాటు పీపీఏల రద్దు, అమరరాజా కంపెనీని ఏపీ నుంచి తరి మేసిందీ, ఆనాడు లేబర్, పొల్యూషన్ అంటూ అనేక కంపెనీ లను తరిమేసిందీ, పల్లా శ్రీనివాసరావు కమర్షియల్ కాంప్లెక్స్ కు అన్ని అనుమతులు ఉన్నా పగలగొట్టిన క్రెడిట్ కూడా తీసుకోవచ్చు.
రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం
రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయా ల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఉమెన్ క్రిౖట్ టీమ్ను అందరికంటే ముందు నేను కలిశాను. మిథాలీరాజ్ను ఏసీఏ అడ్వైజర్గా నియమించాం. ‘షీ ప్లేస్ అనే కార్యక్రమాన్ని రూపొందించాం. ఇదో నిరంతర ప్రక్రియ. క్రీడల కోసం ఆస్ట్రేలియాలో గ్రిఫిట్ అనే యూనివర్సిటీ ఉంది. ఇక్కడున్న యూనివర్సిటీలతో గ్రిఫిట్ యూనివర్సిటీని అనుసంధానించి ఎకో సిస్టమ్ ఏర్పాటుచేస్తాం.
రెండు, మూడు నెలల్లో డేటా సెంటర్ పనులు
మధురవాడలో డేటా సెంటర్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమవుతాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్కు రోడ్డు కనెక్టివిటీని అభివృద్ధి చేయడం జరుగుతోంది. శంషాబాద్ ఎయి ర్ పోర్ట్ నిర్మాణం పూర్తి అయినప్పుడు రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తికాలేదు. అలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ను ట్రిలి యన్ డాలర్ ఎకానమీగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. వైసీపీ హయాంలోనే 108 వాహనాలు మూతపడ్డాయి తప్ప కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసివేయలేదు.
చట్టబద్ధత వల్లే రాజధాని తరలించలేకపోయింది
చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధాని అమరా వతిని తరలించలేకపోయింది. ఆనాడు ముందు చూపుతో చంద్రబాబు భూముల విషయంలో రైతుల పక్షన అగ్రిమెంట్ చేశారు. అందుకే రాజధానిని తరలించలేకపోయారు. ఈ రోజు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావ తిలో కూడా అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా అవసరం. అందుకే భూములు తీసుకుని మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
ఫార్చ్యూన్-500 కంపెనీలకు భూమి ఇస్తామంటే తప్పేంటి?
99 పైసలకే భూములు ఇస్తే తప్పేంటి. ఫార్చ్యూన్-500 కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూమి ఇస్తాం. తప్పేంటి? ఉద్యోగాలు కల్పించేందుకే మేం ఇక్కడ ఉన్నాం. ఐదేళ్లలో వైసీపీ చేయలేనిది మేం 18 నెలల్లో చేశాం. ఇన్సెంటివ్స్తో పాటు భూములు కూడా తక్కువ ధరకు ఇచ్చాం కాబట్టే కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడుల్లో ఏపీ నెం.1 స్థానంలో ఉంది. 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు తీసుకువస్తున్నాం. క్లస్టర్ విధానంలో మేం ముందుకు వెళుతున్నాం.
మహిళలను కించపరిస్తే సహించేది లేదు
మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైఎస్ భారతిపై పరుష వ్యాఖ్యలు చేసిన మా కార్యకర్తపై చర్యలు తీసుకున్నాం. అతను జైలుకు వెళ్లాడు. వైసీపీ ఐదేళ్ల పాటు నాపైన, మా కుటుంబంపైనా సోషల్ మీడియాలో బురద జల్లారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళను కించపరిస్తే ఎంత ఇబ్బంది పడతారో నేను కళ్లారా చూశా. అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాకు రావాలంటే ఒక వయస్సు అనేది ఉంటుంది. అది పాటించడం లేదు. అవన్నీ మేం చర్చిస్తున్నాం.
జగన్రెడ్డి హయాంలోనే సీమ ఎత్తిపోతలపై స్టే
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయ లబ్ధి పొందేందుకు కొంతమంది వివాదం చేస్తున్నారు. 2020లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే వచ్చింది. గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఏపీలోకి ప్రవేశించిన తర్వాతనే ఆ నీటిని లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలించాలనేది విజన్. తెలంగాణ ప్రాజెక్టులకు చిల్లు ఎవరూ పెట్టడం లేదు. వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఒక్క టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయి. అలాం టిది వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీటిని లిఫ్ట్ చేసి రాయలసీమకు తీసుౖళ్లాలనేది మా ఆలోచన. శాసనసభ సాక్ష్షిగా పట్టిసీమ దండగ అన్న వ్యక్తి ఐదేళ్లు పాటు ఆపరేట్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఆందోళన వద్దు
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు ఆందోళనకు గురికావద్దు. విద్యార్థులకు, ఫీజు రీయింబర్స్మెంట్కు ఎలాంటి సంబంధం లేదు. వారు హాయిగా వెళ్లి చదువుకోవచ్చు. మేం కాలేజీ అకౌంట్లకే నేరుగా నగదు జమచేస్తున్నాం. 2024 తర్వాత ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సగం చెల్లించాం. మిగతా బకాయిలు కూడా మరో రెండు నెలల్లో చెల్లిస్తాం. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్నే మేం పాటిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్యసేవ విషయంలో కూడా ఎన్నడూ లేని విధంగా మేం అన్నీ చెల్లిస్తూనే వస్తున్నాం. ఒక నెల అటూ ఇటూ కావచ్చు తప్ప ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నాం. దీనిని స్ట్రీమ్ లైన్ చేసేందుకు ఇన్సూరెన్స్ మోడల్లో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం.
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ నినాదం
ఆర్థిక రాజధాని విశాఖపట్నం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నాడు, నేడు, ఎప్పుడూ అదే మా నినాదం. దానికి కట్టుబడి ఉన్నాం. అందుకే పెద్దఎత్తున పెట్టుబడులు ఇక్కడకు వస్తున్నాయి. క్లస్టర్ బేస్ డెవలప్మెంట్ మా విధానం. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వ నినాదం. అమరావతి, విశాఖ, తిరుపతి ఎకనామిక్ రీజియన్ లను సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. టాప్-100 ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చేసి చూపిస్తాం.
శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఆ మేరకు మేం ప్రజలకు హామీ ఇచ్చాం. హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు. దానిని అమలుచేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మహిళలను గౌరవించేలా కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్లో మార్పులు చేస్తున్నాం. అత్యాచారాలు, దాడులకు పాల్పడినా, మహిళలను కించపరిచినా వదిలిపెట్టేది లేదు. రాష్ట్రవ్యాప్తంగా రౌడీషీటర్లను ఊరేగిస్తున్నాం. గంజాయి స్మగ్లర్లను కూడా హెచ్చరిస్తున్నా. మేం ఎవరినీ వదిలిపెట్టేది లేదు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.
అర్హులందరికీ పెన్షన్లు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాం
అర్హులందరికీ పెన్షన్లు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు, వికలాంగ పెన్షన్ రూ.6 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు చెల్లిస్తున్నాం. విద్యారంగంలో ఇప్పటికే సంస్కరణలు తీసుకువచ్చాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషిచేస్తున్నాం. నిడమర్రు పాఠశాలను సొంత నిధులతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు.















