- వారిని చూసి మిగతావారు నేర్చుకోవాలి
- విశాఖలో అద్భుతంగా యోగా డే నిర్వహణ
- కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ల పనితీరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. గత 11 ఏళ్లుగా అనేక చోట్ల యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నా.. కానీ, ఎక్కడారాని అనుభూతి యోగా డే రోజు విశాఖలో వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగాంధ్రపై ప్రధాని మాట్లాడారు. యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను మెచ్చుకున్నారు. చంద్రబాబు, లోకేష్ను చూసి మిగతావారు నేర్చుకోవాలన్నారు. యోగాంధ్ర నిర్వహణపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. నివేదిక వచ్చాక మిగతా రాష్ట్రాలకు పంపించి అధ్యయనం చేయాలని చెబుతామన్నారు. యోగాంధ్ర విజయాన్ని అందరూ కేస్ స్టడీగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో గిన్నిస్ రికార్డు స్థాయిలో జరిగింది. అద్భుతమైన ప్లానింగ్తో చిన్న పొరపాట్లు కూడా లేకుండా ఈ కార్యక్రమం జరగడం ప్రధాని మోదీని అబ్బురపరిచింది. అప్పుడే వేదిక మీదనే మంత్రి లోకేష్ను ప్రధాని ప్రశంసించారు. అయితే ఆ కార్యక్రమం నిర్వహణ మొత్తం ప్రధాని మోదీ మనసులో చెరగని ముద్ర వేసిందనే విషయం తాజాగా కేబినెట్ భేటీలో ఆయన ప్రశంసలతో స్పష్టమయింది.
మంత్రి నారా లోకేష్.. గిన్నిస్ రికార్డు టార్గెట్గా పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటంలో కీలక పాత్ర పోషించారు. మూడు లక్షల మందికిపైగా ఒకే సారి .. ఒకే చోట.. విశాఖ నుంచి భీమిలి వరకు యోగా చేశారు. ఇది గిన్నీస్ రికార్డు కూడా సాధించింది.