- ఆయా శాఖలతో కమిటీ ఏర్పాటు చేస్తాం
- అత్యవసర సమస్యలను ఇప్పటికే గుర్తించాం
- ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ప్రభా వం వల్ల తమ జీవనోపాధి మీద ప్రభావం చూపుతుందని ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలు ఎదు ర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను. ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాల వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను. అయితే వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాను. మీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకుని పరిష్కార మార్గాలు అన్వేషిం చాలని ఆదేశించాను. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, కారణంగా ఫిషరీష్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించాం. సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధుల మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా ఈ కమిటీ దృష్టిపె డుతుంది. నష్ట పరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుం ది. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి అమ లు చేయదగిన సిఫారసులతో కూడిన నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తిం చాం. మరణించిన 18 మంది మత్స్యకారులకు సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బ తిన్న పడవలకు నష్ట పరిహారం చెల్లిం పు అంశాలపై అధికారులతో చర్చించాను. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించాను. అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదిత ర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వ డంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశాను. ఈ అంశాల పై కమిటీ నివేదిక కోసం ఎదురుచూడకుండా ప్రాధాన్యంతో పరిష్కరించాలని తెలిపాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వం కూటమి ప్రభుత్వం కష్ట జీవులకు భరోసా కల్పిస్తుంది. 53 క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను. వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. అసెం బ్లీ సమావేశాలు ముగిసిన తరువాత, నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని తెలిపారు.