అమరావతి (చైతన్యరథం): వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, డ్యూటీలో ఉన్న పోలీసులపై వైసీపీ సైకోలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జగన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు.. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు. సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశే. మహిళలపై వైకాపా నేతలు ఒళ్లు బలిసి మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై వైకాపా చేసిన దాడికి జగన్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు.