- కుప్పం ప్రజలకు భువనమ్మ భరోసా
- శాంతిపురం నివాసంలో ప్రజాదర్బార్
కుప్పం (చైతన్యరథం): కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. కుప్పం పర్యటనలో రెండో రోజు గురువారం శాంతిపురంలోని తన నివాసంలో నారా భువనేశ్వరి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి మర్యాద పూర్వకంగా భువనేశ్వరిని కలిశారు. స్థానిక ప్రజల నుంచి భువనేశ్వరి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఆమె అభినందించారు. దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.











