- రాయలసీమకు నీళ్లివ్వడాన్ని వైసీపీ జీర్ణించుకోలేదు
- నాటకాలు వైసీపీకి అలవాటు… నీళ్లివ్వడం ఎన్డీఏకు అలవాటు
- కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చినట్టుంది..
- కృష్ణమ్మను కుప్పానికి తెచ్చి.. మాట నిలబెట్టుకున్నాను
- రప్పారప్పా రాజకీయాలేంటో పులివెందుల ప్రజలు వైసీపీకి చూపారు
- పోలవరం- బనకచర్లతో శాశ్వత కరవు నివారణ సాధ్యం
- నదుల అనుసంధాన లాభాలను తెలంగాణ చేసుకోవాలి
- స్త్రీశక్తితో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఉండదు… ఆదుకుంటాం
- ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేని చేసిన కుప్పం రుణం తీర్చుకుంటా
- బహిరంగ సభలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
- పరమసముద్రం చెరువు వద్ద కృష్ణమ్మకు జలహారతి
- అసెంబ్లీలో చర్చ వీడియోను సభలో ప్రదర్శించిన సీఎం
“రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నాం. అన్ని రంగాలలో సీమను అభివృద్ధి చేసేలా మా దగ్గర ప్రణాళికలున్నాయి. దీంట్లో భాగంగానే రాయలసీమకు హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కుప్పం చిట్టచివరి భూములకు జలాలు అందించాం. రాయలసీమకు నీళ్లిస్తే వైసీపీ జీర్ణించుకోలేదు. నాటకాలు ఆడడం ఆ పార్టీకి అలవాటు. ఎన్డీఏకు నీళ్లు తేవడం అలవాటు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహరతి ఇచ్చారు. హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కృష్ణా జాలాలు కుప్పం చివరి భూములకు చేరాయి. శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ కుప్పానికి చేరుకుంది. దీంతో కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.
కుప్పం (చైతన్య రథం): “రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నాం. అన్ని రంగాలలో సీమను అభివృద్ధి చేసేలా మా దగ్గర
ప్రణాళికలున్నాయి. దీంట్లో భాగంగానే రాయలసీమకు హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కుప్పం చిట్టచివరి భూములకు జలాలు అందించాం. రాయలసీమకు నీళ్లిస్తే వైసీపీ జీర్ణించుకోలేదు. నాటకాలు ఆడడం ఆ పార్టీకి అలవాటు. ఎన్డీఏకు నీళ్లు తేవడం అలవాటు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహరతి
ఇచ్చారు. హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కృష్ణా జాలాలు కుప్పం చివరి భూములకు చేరాయి. శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ కుప్పానికి చేరుకుంది. దీంతో కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఈ సందర్భంగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు తన నివాసంనుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్దకు ఆర్టీసీ బస్సులో మహిళలు, రైతులతో కలిసి చేరుకుని జలహారతి ఇచ్చారు. సంప్రదాయ పద్ధతిలో పంచె కట్టుకుని కృష్ణమ్మకు జలహరతి అందించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు పసుపు, కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా పరమసముద్రంచెరువు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘నన్ను 8సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన నా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావడంతో నా జన్మ ధన్యమైంది. నా సంకల్పం నెరవేరింది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కృష్ణా పుష్కరాలు 2028లో వస్తుంటే కుప్పానికి మాత్రం రెండేళ్లు ముందే వచ్చాయి. కుప్పం ప్రజలు నన్ను ఇంటిబిడ్డగా ఆదరించారు. వారికి నేను ఏంచేసినా తక్కువే’నని చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు.
ఎన్టీఆర్ సంకల్పాన్ని నెరవేర్చాం
“ఆనాడు ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంతో కాటన్ దొర కృష్ణా, గోదావరి జిల్లాల పరిస్థితి మార్చేశాడు. అందుకే కాటన్ దొరను అక్కడి ప్రజలు ఆరాధిస్తారు. అలాగే ఎన్టీఆర్ కృష్ణా మిగులు జలాలు సీమకు తేవాలని సంకల్పించారు. సీమను సస్యశ్యామలం చేయాలని కలలుగన్నారు. సీమలో పశువులను బతికించుకోవడానికి రైళ్లలో నీళ్లను తెప్పించిన పరిస్థితి నాడు ఉండేది. వేరుశనగ పంట వేస్తే కనీసం విత్తనాల ఖర్చు కూడా వచ్చేది కాదు. సీమలో ఇలాంటి పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో 1999లో హంద్రినీవాను నేనే ప్రారంభించాను. 2025 నాటికి పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చాం” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘శ్రీశైలం మల్లన్న పాదాల చెంతనుంచి కుప్పం మల్లన్న వద్దకు కృష్ణా జలాలను తెచ్చాం. గంగమ్మ కరుణించింది. కృష్ణమ్మ తరలి వచ్చింది. 2014-19 మధ్య సీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.12,441 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. ఎన్నికల ముందు గేట్లతో సెట్టింగులు వేసి డ్రామాలాడారు. నీళ్లు కూడా బయటనుంచి తెచ్చి వదిలారు. వారు విమానం ఎక్కేలోగానే ఆ నీరు ఇంకిపోయింది. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ దిట్ట. అసాధ్యాలు సుసాధ్యం చేయడంలో ఎన్డీఏ దిట్ట. నేను వెళ్లేలోగా నీరు ఇంకిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతి చెరువుకు నీరిచ్చే బాధ్యత నాది” అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
టీడీపీకి నీటి విలువ తెలుసు
“నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం. వైసీపీలాంటి పార్టీలకు నీటి విలువ, రైతు సమస్యలు ఎప్పటికీ తెలియవు. 100 రోజుల కార్యాచరణ లక్ష్యంతో రూ.3,850 కోట్లు మంజూరు చేశాం. కాల్వలు వెడల్పు చేశాం. నాలుగు నెలల్లో 40 టీఎంసీ నీరు తెచ్చాం. పది రిజర్వాయర్లను నింపాం. చెరువులను నింపుతున్నాం. సీమ జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుంది. పరిశ్రమలకు కూడా నీరు లభిస్తుంది. వచ్చే ఏడాదికి చిత్తూరు చివరి భూములకు కూడా నీరందిస్తాం, పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వంశధార-పెన్నా నదుల అనుసంధానం చేయవచ్చు. ఇదే జరిగితే రాయలసీమకే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాశ్వత కరవు నివారణ సాధ్యమవుతుంది. తెంలగాణ ప్రజలు, నేతలు కూడా సదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను అర్ధం చేసుకోవాలి. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నీటి నిర్వహణపైనే దృష్టి పెట్టాను. నీరు-మీరు, నీరు-చెట్టు, చెక్ డ్యాములు, సాగునీటి సంఘాలు, వాటర్ షెడ్లు అంటూ నీటి నిర్వహణ కోసం ప్రయత్నించాను. పరుగెత్తే నీటిని నడిపించాలి. నడిచే నీటిని నిలపాలనే సూత్రంతో పనిచేశాను. కుప్పం సహా సీమలోని ప్రతి చెరువును నింపుతాం, చెరువులను నింపితే… వర్షాభావ పరిస్థితులు వచ్చినా తట్టుకోగలం” అని సీఎం స్పష్టం చేశారు.
రాక్షసుల్లా అడ్డు పడుతున్నారు.
“రాష్ట్రాభివృద్ధికి యజ్ఞం చేస్తుంటే… కొందరు రాక్షసుల్లా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రతి మంచి పనికీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. చేతనైతే అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడాలి. మొన్నటి ఎన్నికల్లో సీమ ప్రజలు 52 సీట్లకుగాను వాళ్లకు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదు. ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైసీపీ విష వృక్షంలా తయారైంది. తన ఉనికి చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారి కుట్రలకు కాలం చెల్లింది. ప్రజలు చైతన్యంతో కుట్రలు బద్దలు కొడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పంలో తెలుగుదేశాన్నే గెలిపిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించారు. రప్పా రప్పా రాజకీయం చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో రప్పారప్పా రాజకీయం ఎలా ఉంటుందో… ప్రజలే వారికి చూపించారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా… ఇబ్బందులు సృష్టించినా.. అభివృద్ధి చేస్తున్నాం.. సంక్షేమమూ చేపడుతున్నాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఆటో డ్రైవర్లకూ అండగా ఉంటాం
“ఉచిత బస్సు ప్రయాణంతో ఆడబిడ్డలంతా సంతోషంగా ఉన్నారు. స్త్రీశక్తితో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా చూస్తాం. వారిని అదుకుంటాం. ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమ లు చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల రిక్రూట్ మెంట్ చేపడుతున్నాం. కుప్పంనుంచి కూడా 50మంది. టీచర్లు ఎంపికయ్యారు. కుప్పం నియోజకవర్గానికి ఒకప్పుడు టీచర్లే వచ్చేవారు కారు. ట్రాన్సఫర్లు చేయిం చుకుని వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు కుప్పం యువతీ యువకులే టీచర్లయ్యారు. తల్లికి వందనం అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతు లను ఆదుకుంటున్నాం. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. పెన్షన్లు ఇస్తున్నాం. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ పాలన సాగిస్తు న్నాం. కుప్పానికి 12పరిశ్రమలు వచ్చాయి. రూ.3908 కోట్లు పెట్టుబడులు, 15600 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 26581 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. ఐ-ఫోన్ ఛాసిస్ ఉత్పత్తి చేసేలా హిందాల్కో సంస్థ యూనిట్టును ప్రారంభించబోతోంది. కుప్పాన్ని ఇతర రాష్ట్రాలకు కనెక్ట్ చేస్తూ పెద్దఎత్తున రహదారుల నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోని టెక్నాలజీనం తా కుప్పానికి తెస్తాను” అని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల, చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.