ఉండవల్లి (చైతన్య రథం): ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్య పరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు. కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాదె రామయ్య `సీతారావమ్మ ఎంపీయూపీ స్కూల్ బూత్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… ఓటు వేయడం అందరి బాధ్యతని, దాన్ని హక్కుగా వినియోగించుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ ప్రతిష్టకు ఓటు బలంగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.