అమరావతి (చైతన్యరథం): ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైంది. ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలి. ఈ తెలుగు సంవత్సరాది మీ ఆశలు, ఆశయాలు నెరవేర్చి.. ఏడాది పొడవునా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మేరకు ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.