- నేడు అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల
- పుకార్లు రేపే వారిపై చట్టపరంగా చర్యలు
- మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి
అమరావతి(చైతన్యరథం): అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వం దృఢ సంకల్పమని మెగా డీఎస్సీ కన్వీ నర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు. మెగా డీఎస్సీ-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారద ర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగిం దని చెప్పారు. తర్వాత టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థు లకు తగిన సమయం ఇచ్చినట్లు చెప్పారు. అభ్యర్థుల స్కోర్ కార్డు లు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించు కోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చినట్లు తెలిపారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22న మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. మెరిట్ లిస్ట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుందని వివరించారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు. వివిధ కేటగిరీ లకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుందని చెప్పారు.
సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరిం చిన మూడు సెట్ల జెరాక్స్ కాపీలు, 5 పాస్పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుం దని సూచించారు. వెరిఫికేషన్కు హాజరుకావడానికి మునుపే సం బంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్లిస్ట్ డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా, అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తూ, అభ్యర్థుల మనోభావా లను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు కేవలం డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశారు. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్, జిల్లా విద్యాధికారి వెబ్సైట్, క్యాండిడేట్ లాగిన్లో, ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడే పత్రికా ప్రకటన ల్లో మాత్రమే తెలియజేయబడతాయని తెలిపారు.