అమరావతి (చైతన్య రథం): అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈరోజు సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి గురువారంనాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరిట రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా అమరావతిలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం సాధించింది? రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటోంది? ఏ విజన్తో అడుగులు ముందుకు వేయనుందన్న అంశాలు ప్రజలకు వివరించేలా కార్యక్రమం రూపొందించారు. సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి పునరంకితమయ్యేలా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, స్వర్ణాంధ్ర విజన్ కార్యాచరణ ప్రణాళిక జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి సభ్యులు, సచివాలయంలోని కీలక అధికారులను ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరగడంతో కార్యక్రమం నేటికి వాయిదా పడిరది.
పేరులో మార్పుతో ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించే సభకు ‘సుపరిపాలన- తొలి అడుగు’ పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అంతకు ముందు సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ అనే టైటిల్ను ఖరారు చేయగా.. పేరులో మార్పులు చేసింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రొటోకాల్ విభాగాన్ని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.