- తమకంటిలో దూలాలు పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసులు వెతుకుతున్న జగన్ ముఠా
- జగన్ పాలనలో విషపూరిత మద్యంతాగి 35 లక్షలమంది ఆరోగ్యాలు నాశనమయ్యింది నిజం
- లిక్కర్ స్కాంలో లక్ష కోట్లు కొల్లగొట్టిన జగన్ కోటరీ
- పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించింది జగన్ ప్రభుత్వమే
- నాడు సైబరాబాద్పై నిందలు `నేడు అమరావతిపై విద్వేష దాడి
- నాడు కియా రాయితీలపై నిందలు `నేడు టీసీఎస్ భూకేటాయింపులపై అపవాదులు
- ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల్ని కబ్జాలు చేసిన జగన్ ముఠా
- సూపర్ సిక్స్ అమలు చేసేది ఖాయం `వైకాపా దివాళా తీసేది నిజం
- నవరత్నాల్ని నవ మోసాలు చేసిన జగన్ పాలన
- పింఛన్లు మొదటి ఏడాదిలో జగన్ రూ.250 పెంచగా… చంద్రన్న రూ.1000 పెంచారు.
- మెగా డిఎస్సీ హామీపై జగన్ మొండిచేయి చూపగా.. లోకేష్ మొదటి ఏడాదే నోటిఫికేషన్ ఇచ్చారు
- జగన్ పాలనలో విషపూరిత మద్యం క్వార్టర్ రూ.180.. చంద్రన్న పాలనలో నాణ్యమైన మద్యం రూ.99
- నాడు శాండ్ మాఫియాతో 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదు -నేడు ఉచిత ఇసుకతో కళకళ
- అవినీతి సాక్షి ఉద్యోగి వర్ధెల్లి మురళి అబద్ధాల కుతంత్రం-19
20.4.2025న వర్ధెల్లి మురళి సాక్షిలో పాచిపాటనే పాడారు. ఆయనకు దుర్యోధనుని పాలనలో ద్రౌపది వలువలు వలిచిన సీను మంచిగా కనిపించింది. ధర్మరాజు పాలనంతా మురళికి దుర్మార్గంగా కనిపిస్తున్నది.
విశాఖ కార్పొరేషన్ అవిశ్వాసంపై నీతి బోధనలా?
జగన్ పాలనలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల హింస కనపడదా? అవి అసలు ఎన్నికలేనా? మీ బంగారం మంచిదైతే ఎవరూ ఏమీ చేయలేరుకదా!
పంచాయితీ ఎన్నికల్లో జగన్ ముఠా అక్రమాలు
1. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ 1045
2. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు 182
3. దాడులు 160
4. కిడ్నాప్లు 48
5. ఆస్తుల విధ్వంసం 118
6. హత్యా యత్నాలు 48
7. హత్యలు 03
8. పుంగనూరులో 85 పంచాయితీలకు ఏకగ్రీవాలు 85
9. మాచర్లలో 77 పంచాయితీలకు ఏకగ్రీవాలు 74
10. పులివెందులలో 108 పంచాయతీలకు ఏకగ్రీవాలు 90
పై దుర్మార్గాలు విశాఖలో కనపడలేదు కదా మురుళిగారు?
విమానయానం డీలాపడిరది జగన్ పాలనలోనే
-చంద్రబాబు పాలనలో 2018-19లో వివిధ దేశాలనుంచి రాష్ట్రానికి 1,21,630మంది రాకపోకలు సాగించారు. 2023-24 జగన్ పాలనలో ఈ సంఖ్య 66,192కు పడిపోయింది. అంటే సుమారు 45 శాతానికి పైగా ప్రయాణీకులు తగ్గిపోయారు. దీంతో ట్యాక్సీలు, హోటళ్లవంటి వ్యాపారాలు, వృత్తులు దెబ్బతిన్నాయి. విజయవాడ నుంచి విశాఖకు ఎయిర్ ఇండియా షెడ్యూల్లో మార్పులవల్ల తాత్కాలికంగా సర్వీసులు నిలిపివేయడం జరిగింది. 2024-25 చంద్రబాబు నేటి పాలనలో విమాన ప్రయాణీకుల సంఖ్య 10 లక్షలకు పెరిగింది. 2014-19లో వయోబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్, మలేషియా, కడప, ఓర్వకల్లాంటి ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపగా.. జగన్ దాన్ని రద్దు చేసి ప్రయాణీకుల రాకపోకలకు దెబ్బకొట్టారు. జగన్ తనకు రెండు హెలికాప్టర్లు అందుబాటులో పెట్టుకున్నాడు.
లక్షలాది ఎకరాల భూముల్ని కొట్టేసింది జగన్ ముఠానే
12వేల ఉద్యోగాలు కల్పించే టీసీఎస్కు చంద్రబాబు ప్రభుత్వం 21 ఎకరాలు కేటాయించడాన్ని వర్ధెల్లి మురళి స్కాంగా చిత్రీకరిస్తున్నారు. అలాగే ఉర్సూ డేటా సెంటర్కు 60 ఎకరాలు కేటాయించడంపైన దుమ్మెత్తిపోస్తున్నారు. కియా కార్ల పరిశ్రమకు చంద్రబాబు రాయితీలు ఇచ్చినప్పుడు కూడ జగన్ బృందం నిందలు వేసింది. 2017లో కియాకు అనుమతిస్తే 2019 నాటికే కార్ల ఉత్పత్తి ప్రారంభించింది. 2024 నాటికి 12 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. అందులో 18 వేలమందికి ఉపాధి లభించింది. కియా పరిశ్రమ రాకముందు ఆ ప్రాంతంలోని రైతుల భూమి ఎకరం విలువ రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల లోపు ఉండేది. నేడు కియా పరిశ్రమకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎకరం భూమి ధర రూ.50 లక్షల నుండి రూ.కోటి వరకూ పలుకుతోంది. కియా పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు వివిధ రకాల పన్నుల ద్వారా రూ.10 వేల కోట్లు చెల్లించింది. కియా రాయితీలపై నాడు విమర్శలు చేసిన జగన్ ముఠాకు నేడు చెంపలేసుకోగల నిజాయితీ ఉందా? గతంలో సైబరాబాద్లో మైండ్ స్పేస్కు స్థలం కేటాయించినప్పుడు కూడా వైఎస్ కోటరీ ఇలానే చంద్రబాబుపై నిందలు వేశారు.
సైబరాబాద్లో వందల ఎకరాలు మాత్రమే పరిశ్రమలకు కేటాయిస్తే.. అవి 30 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాయి. మరి జగన్, ఆయన తండ్రి లక్షల ఎకరాలు కేటాయించారు. వాటివల్ల జగన్ కుటుంబం లాభపడిరదే తప్ప ప్రజలు, ప్రభుత్వం లాభపడలేదు. లేపాక్షి నాలెడ్జ్ హబ్కు పార్థసారథి రెడ్డికి వైఎస్ ప్రభుత్వం 8 వేల ఎకరాలు కేటాయించింది. అందుకు ఆయన సాక్షి మీడియాకు వందల కోట్లు ఇచ్చారు. అనంతపూర్ జిల్లాకు లేపాక్షి నాలెడ్జ్ హబ్వల్ల ఒక్క ఉద్యోగం రాలేదు. అలాగే జగన్ ప్రభుత్వం 2022 ఫిబ్రవరి 3న హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో పుల్లారెడ్డి స్వీట్స్ బిల్డింగ్ అడ్రస్లో ఇండోసోల్ కంపెనీని జగన్ సన్నిహితుడు ఎన్ విశ్వేశ్వర్ రెడ్డి రిజిష్టర్ చేశారు. ఆ కంపెనీ పెయిడప్ క్యాపిటల్ రూ.లక్ష మాత్రమే. అప్పటి వరకు ఇండోసోల్ ఎలాంటి ప్రాజెక్టుల్ని నిర్వహించింది లేదు. ఈ కొత్త కంపెనీ పెట్టిన ఆరు నెలలకు అంటే సెప్టెంబర్ 5, 2022న జగన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి 7,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఇచ్చింది వాస్తవం కాదా? ఇండోసోల్కు గతంలో అనుమతించిన 5,148 ఎకరాల కేటాయింపులకు అదనంగా మరో 3,200 ఎకరాల సేకరణకు జగన్ ప్రభుత్వం అంగీకరించింది నిజం కాదా? ఇండోసోల్కు 50 వేల కోట్లు వివిధ రాయితీల క్రింద మంజూరు చేశారు.
అలాగే విశాఖలో రూ.15 లక్షలకే 15 ఎకరాలు శారదా పీఠానికి కట్టబెట్టారు. వైసీపీ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ ఎన్సీసీ కంపెనీకి 97 ఎకరాలు కట్టబెట్టారు. జగన్ సోదరుడు అనిల్రెడ్డి బినామీగా కార్తికవనం (రాడిసన్ హోటల్), బేపార్క్, రామానాయుడు స్టూడియోలో 15 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం. సొంతానికి వేల ఎకరాలు కొట్టేసిన వారి తరపున వర్ధెల్లి మురళి చేసే వాదనలు చూసి ఎవరైనా నవ్వక మానరు. 12 వేల ఉద్యోగాలు కల్పించబోతున్న టిసీఎస్కు కొద్దిపాటి భూములు కేటాయిస్తే దానిపై దుష్ప్రచారం చేస్తే నమ్మడానికి ఆంధ్రులేమీ అమాయకులు కాదు.
మద్యపానం నిషేధిస్తామని ఆచరణ యోగ్యంకాని హామీలిచ్చింది జగనే
మద్యపాన నిషేదం, సీపీఎస్ రద్దులాంటి ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి మోసం చేసింది జగనే. మద్య నిషేధం చేయకపోగా రూ.60 ఉన్న క్వార్టర్ మద్యం ధర రూ.180కి పెంచి పేదల సంపాదన లక్ష కోట్లు కొల్లగొట్టారు. పైగా విషఫూరిత మద్యంపోసి 35 లక్షలమంది పేదల ఆరోగ్యం నాశనం చేశారు. 4 లక్షల బెల్టు షాపులు పెట్టించారు. ఇలా 85 శాతం హామీలకు ఎగనామం పెట్టింది జగన్ ప్రభుత్వమే. అమ్మఒడికి రూ.13 వేలిచ్చి నాన్న బుడ్డిలోంచి రూ.లక్ష కొట్టేసి నవరత్నాల్ని నవ మోసాలు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ తప్పక అమలు చేస్తోంది. జగన్ మొదటి ఏడాది పింఛన్లు రూ.250లు మాత్రమే పెంచగా.. చంద్రన్న ప్రభుత్వం రూ.1,000లు పెంచారు. జగన్ ఒక్క డిఎస్సీ కూడా జరపలేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 16,347 ఉపాధ్యాయ నియామకాలకు చంద్రన్న జన్మదిన కానుకగా ఏప్రిల్ 20న డిఎస్సీకి షెడ్యూల్ ప్రకటించారు. మత్స్యకారుల వేట నిషేధ భృతి జగన్ రూ.10 వేలు ఇవ్వగా… చంద్రబాబు ఈనెల 26న రూ.20 వేలు ఇవ్వబోతున్నారు. అమ్మఒడికి జగన్ ఒక్కరికి రూ.13 వేలు ఇవ్వగా, చంద్రన్న ఇద్దరికి రూ.30 వేలు ఇవ్వబోతున్నారు. రైతు భరోసాకు జగన్ రాష్ట్ర నిధుల నుండి రూ.7,500లు ఇవ్వగా.. చంద్రబాబు అన్నదాత సుఖీభవకు రూ.14 వేలు జులైలోపు ఇవ్వబోతున్నారు. కోటిమంది మహిళలకు ఉచిత గ్యాస్ ఇచ్చారు. ఇలా 10 నెలల్లోనే 50 శాతానికి పైగా హామీల్ని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. సూపర్ సిక్స్పై సాక్షి మీడియా చేసేది ఒట్టి అబద్ధపు ప్రచారమే.
విజన్ 2020ని 420అని హేళన చేసిన జగన్ తండ్రి కోటరీ ఏమైంది?
విజన్ 2020 నిజమై సైబరాబాద్లో ఉమ్మడి ఏపీలోని 294 నియోజకవర్గాల వారికి 30 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. విజన్ 2020 వల్లే చంద్రన్న 15 వేల మెగావాట్లు విద్యుదుత్పత్తి ప్లాంట్లు స్థాపించారు. ఇందువల్ల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము. గృహాలకు, వ్యాపారులకు, పరిశ్రమలకు కోతలులేని కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఇలా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిజమై ప్రజల ముందున్నవి.
అలానే స్వర్ణాంధ్ర విజన్ 2047 విజయవంతమౌతుంది. కొన్ని గృహాలకే జగన్లా బోరు నీళ్లు కాకుండా.. నదీ జలాలతో ప్రతి ఇంటికి చంద్రన్న కుళాయి నీరు ఇవ్వబోతున్నారు. పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, తిరుపతి.. అమరావతి.. విశాఖ గ్రోత్ సెంటర్లుగా విరాజిల్లుతాయి. పర్యాటకం పెరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీని వాగాడంబరం అన్న వర్థెల్లి మురళి చెంపలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. విజన్ 2020ని 420 అన్నవాళ్లే నేడు కోర్టుల్లో 420లుగా నిలబడుతున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047పై నోరు పారేసుకుంటున్న వారు కూడ భవిష్యత్తులో నవ్వులపాలు కాక తప్పదు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధిస్తాం. తెలుగు వారు అగ్రస్థానం పొందాలంటే జగన్ ముఠా అబద్ధాల ప్రచారాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంటుంది.
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్