అమరావతి (చైతన్యరథం): అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నామన్నారు. వైద్య కళాశాల వసతి భవనాలపై విమానం కూలడంతో ఈ ప్రమాదం ఒక మహా విషాదంగా మిగిలిందన్నారు ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు దేశం బాసటగా ఉండాలని పవన్ అన్నారు.