విశాఖ (చైతన్య రథం): యోగాంధ్ర నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్తో ప్రధాని మోదీ మాటా మంతీలో పాల్గొన్నారు. ప్రపంచం ఏపీవైపు చూసేలా చేశారని మోదీ ప్రశంసించారు. యోగాంధ్ర ద్వారా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నామని చంద్రబాబు.. ప్రధానితో అన్నారు. ఏపీ నాయకుల పనితీరు భేష్ అంటూ మోదీ ప్రశంసించారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఇవాళ సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. శనివారం విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. విశాఖ ఎయిర్పోర్టు నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని, అక్కడ నుంచి నౌకాదళ అతిథిగృహానికి వెళ్లి రాత్రికి అక్కడే బసచేశారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం ఆర్కే బీచ్ లో నిర్వహించే యోగాసనాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం 11.50 గంటలకు ఢల్లీికి తిరుగు పయనమవుతారని సమాచారం.