- విద్యావ్యవస్థ ప్రక్షాళనకు నిరంతరం శ్రమిస్తున్నాం
- టెన్త్ మూల్యాంకనంలో మానవ తప్పిదం 0.25 శాతమే
- జగన్ రెడ్డి అసంబద్ధ నిర్ణయాలతో 12 లక్షల మంది విద్యార్థుల ప్రైవేటుబాట
- యూనిఫాం నుంచి చిక్కీల వరకు వైసీపీ రంగులతో విద్యావాతావరణం కలుషితం
- సరైన సన్నద్ధత లేకుండానే సీబీఎస్ఈ అంటూ గాలిమేడలు
- ఐబీ విధానం తెచ్చామంటూ కలల్లో బతుకుతున్న జగన్ రెడ్డి
- వైసీపీ హయాంలో వికృత రాజకీయ క్రీడలకు నిలయాలుగా వర్శిటీలు
- టెన్త్క్లాసులోనే పేపర్లు కొట్టేసిన ఘనుడు
- హుందాతనం ఆశించడం మా తప్పే
- అటు ప్రజా జీవితం, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ విఫలజీవి
- జగన్రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో భ్రష్టు పట్టించిన విద్యావ్యవస్థను సరిదిద్దేందుకు ఎంతో శ్రమిస్తున్నామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలతో లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన జగన్ రెడ్డి.. నేడు విద్యా వ్యవస్థపై విమర్శలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్రెడ్డి ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన జగన్ నుంచి హుందాతనం ఆశించడం తమ తప్పేనన్నారు. పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంపై జగన్, ఆయన బ్యాచ్ అవాస్తవ ఆరోపణలతో బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ ఏడాది 45,96,527 లక్షల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తే.. రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ తరువాత మార్కుల్లో వ్యత్యాసం వచ్చిన జవాబు పత్రాల సంఖ్య 11,175. మాత్రమే. అంటే 99.75 శాతం కచ్చితత్వంతో మూల్యాంకనం జరిగింది. మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమే. వాస్తవం ఆ విధంగా ఉంటే ఏదో జరిగిపోయిందని జగన్ రెడ్డి గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. జగన్ హయాంలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేయటంతో 12 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు బాటపట్టారు. సీబీఎస్ఈ, ఐబీ అంటూ గాలిలో మేడలు కట్టారు. విశ్వవిద్యాలయాలను వికృత రాజకీయ క్రీడలకు నిలయంగా మార్చారు. విద్యార్థులకు అందించే కిట్లు, యూనిఫాం, చిక్కీలు, చివరికి కోడిగుడ్లకూ వైసీపీ రంగులు పులిమి పవిత్రమైన పాఠశాలల వాతావరణాన్ని కలుషితం చేశారు. ఇన్ని చేసి దిగిపోతూ ఫీజులు, ఇతరత్రా కలిపి రూ.5,500 కోట్ల బకాయిలు మా నెత్తిన పెట్టిపోయారు. విద్యారంగాన్ని ఇంతలా నాశనం చేసిన జగన్రెడ్డి.. దాని ప్రక్షాళన కోసం నిరంతరం శ్రమిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేయటంపై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టెన్త్ పేపర్తు ఎత్తుకెళ్లిన ఘనత మీది
ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే! యూనిఫామ్ దగ్గర నుండి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం మీకే చెల్లింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే పాఠ్యపుస్తకాలు రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా? అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు కాపలా పెట్టిన జగన్ రెడ్డి ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేష్ తప్పుబట్టారు.
విద్యార్థులను సిద్ధం చేసిన తరువాతే..
జీఓ 117, ఇతర అసంబద్ధ నిర్ణయాల వల్ల జగన్ ఐదేళ్ల ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని తీసుకొచ్చారు. నేను మంత్రి అయిన వెంటనే నిర్వహించిన టెస్ట్లో 90శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పదో తరగతి ఫెయిల్ అయితే చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చదువు ఆపించి పెళ్లి చేస్తారు. వారి భవిష్యత్తు కోసం ఆలోచించే సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని వాయిదా వేసాం. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చేసిన తరువాతే సీబీఎస్ఈ పరీక్షా విధానాన్ని అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
ఐబీ తెచ్చింది కలలోనా?
ఐబి విద్యావిధానం తీసుకొచ్చానని జగన్ కల కంటున్నట్లు ఉన్నారు. ఐబి అమలు రిపోర్ట్ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసారే తప్ప ఐబి అమలు చెయ్యలేదు. ఇక టోఫెల్ చెప్పే ఉపాధ్యాయులు లేకుండానే అమలు చేసానని జబ్బలు చరుచుకోవడం జగన్కే చెల్లింది. రూ.4500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, కోడిగుడ్ల దగ్గర నుండి చిక్కీల వరకూ రూ.1000 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టి పోయారు. జగన్ హయాంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం నాటి మంత్రి డబ్బులు వసూలు చేసింది బహిరంగ రహస్యం. ఉన్నత విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చి జగన్ ఆడిన వికృత క్రీడ అందరూ చూసారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
ప్రక్షాళనకు చర్యలు
మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నాను. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపడుతున్నాం. కేజీ నుండి పీజీ వరకూ పాఠ్య ప్రణాళిక మారుస్తున్నాం. వన్ క్లాస్ `వన్ టీచర్ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పుస్తకాల బరువు తగ్గించాం, విలువలతో కూడిన విద్య అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసాం. విద్యార్థులకు అందించే కిట్స్ దగ్గర నుండి అనేక పథకాలకు మహనీయుల పేర్లు పెట్టాం. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాం, మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాం. యూనివర్సిటీల పనితీరు మెరుగుపర్చేందుకు ఉత్తమ వ్యక్తులను వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
99.75 శాతం కచ్చితత్వంతో మూల్యాంకనం
పదోతరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినప్పుడు రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోరడం ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ. ఈ ఏడాది 45,96,527 లక్షల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ తరువాత మార్కులలో వ్యత్యాసం వచ్చిన జవాబు పత్రాల సంఖ్య 11,175. అనగా 99.75 శాతం కచ్చితత్వంతో మూల్యాంకనం జరిగింది. మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమే. ఈ ఏడాది కూడా 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10,159 మంది విద్యార్థుల 11,175 స్క్రిప్టుల (16.8శాతం) వ్యత్యాసాలను గుర్తించి, సరిచేశారు. బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నాం. ఈ తేడాలు జగన్ రెడ్డి జమానాలో 2022లో 41,694 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 8,235 స్క్రిప్టుల (20 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2023లో 61,887 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 10,987 స్క్రిప్టుల (18 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2024లో 55,930 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 9,231 స్క్రిప్టుల (17 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. మీ హయాంలో కనీసం ఈ వివరాలను బయట పెట్టే ధైర్యం కూడా చెయ్యలేదు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి మాపై బురద జల్లడం సిగ్గుచేటని మంత్రి లోకేష్ మండిపడ్డారు.
చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
ఇక పరీక్షల నిర్వహణ సరిగా లేదని, పేపర్లు లీకయ్యాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్ – 1 లాంటి కీలకమైన ప్రశ్నపత్రాలను హాయ్ల్యాండ్ లాంటి ప్రైవేటు రిసార్ట్లో వాచ్మెన్లతో దిద్దించింది మీరు కాదా? ధనదాహంతో లక్షలాది మంది యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడిరది మీరు కాదా? ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రీ వెరిఫికేషన్లో తేడాలు గుర్తించిన విద్యార్థులకు అర్జేయుకేటీల్లో అడ్మిషన్లకు జూన్ 10వరకు అవకాశం ఇచ్చాం. ఇతర అడ్మిషన్ల విషయంలో కూడా సమయం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.