- అండగా నిలిచిన మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు
- మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్
హైదరాబాద్(చైతన్యరథం): సింగపూర్లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్లిన తన రెం డవ కుమారుడు మార్క్ శంకర్ అక్కడ తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయ పడ్డాడని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ తెలిపారు. మంగళవారం ఉదయం సిం గపూర్లో ఈ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుందన్నారు. అరకు పర్యటనలో గిరిజన గ్రామాల సందర్శనకు వెళ్లిన సమయంలో ఉదయం నాకు ఫోన్కాల్ వచ్చింది. అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని నా సతీమణి అన్నా తెలిపారని చెప్పారు. ప్రమాదం చిన్నదే అని మొదట భావించానని..అయితే ఒక చిన్నారి మృతిచెందడంతో పాటు 30 మంది గాయాల పాలవడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. చిన్నారి మార్క్ శంకర్కు కూడా చేతులు, కాళ్లపైన గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగ పీల్చడంతో ఊపిరితిత్తులతోకి పొగ చేరినట్టు వైద్యులు ధృవీకరించినట్టు చెప్పారు.
చిన్న గాయాలు అయినప్పటికీ ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో అది దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలకు కార ణం కావచ్చు. దీని నిమిత్తం ప్రస్తుతం బ్రాంకోస్కోపీ జరుగుతోందని, ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెం దడం విచారకరమని, వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన విషయాన్ని మొదట గుర్తించి పిల్లలను కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం తన పెద్ద కుమారుడు అకీరానందన్ పుట్టిన రోజు..దురదృష్టవశాత్తు ఈ రోజు నా చిన్న కుమారుడికి గాయాలు కావడం బాధాకరమ న్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ప్రధాని మోదీ మాట్లాడి మార్క్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
వెంటనే సింగపూర్లో తగు వైద్య ఏర్పాట్లు చేయాలని భారత హై కమిషనర్కు ఆదేశాలిచ్చారు. ఇందుకు మనస్ఫూ ర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. అరకులో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి వివ రాలు అడిగి తెలుసుకున్నారు. సాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో వెంటనే స్పందించి నిండు మనసుతో మార్క్ శంకర్ బాగుండాలని అభిలషించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర ఉససభాపతి రఘురామ కృష్ణంరాజు, మంత్రులు నారా లోకేష్, అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సహచర సినీనటులు, సినీ ప్రముఖులు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.