- నైతిక విలువలతో జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగాలి
- ఉన్నత లక్ష్యాలతో దేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
- విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ పిలుపు
- కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి
మచిలీపట్నం (చైతన్యరథం): సమాజంలో అన్ని సమస్యలకు విద్య పరిష్కారం చూపుతుంది, ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం, సత్తా మీకు ఉన్నాయి, ఇక్కడి నుండే విద్యార్థులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో బుధవారం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… కేవలం గ్రాడ్యుయేషన్తో నేర్చుకోవడం ఆగిపోకూడదు, అది జీవితాంతం కొనసాగాలని ఉద్బోధించారు. మీరు ఉపగ్రహాలను నిర్మించాలని, సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని, హరిత భవనాలను రూపొందించాలని, స్టార్టప్ను ప్రారంభించాలని, గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేయాలని కలలు కని ఉండొచ్చు. ఈ డిజిటల్ యుగంలో జ్ఞానానికి మించిన సంపద లేదు. మీరు మీ కెరీర్లో ఎదుగుతున్నప్పుడు ఎప్పుడూ విలువలను కోల్పోకండి. వాతావరణ మార్పు, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక నిపుణులుగా మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలో పట్టుగొమ్మలుగా నిలవాలని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ గొప్పతనాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. న్యాయం, రాజ్యాంగ విలువలు, సమానత్వం, విద్య పట్ల ఆయనకున్న లోతైన నిబద్ధత మన రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తోంది. క్రమశిక్షణ, సంకల్పం ఈ ఆడిటోరియంలోని ప్రతి యువకుడికి ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది. ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIఖూజుR) స్థాపన వెనుక ఆయన మార్గనిర్దేశక శక్తిగా ఉన్నారు. ధైర్యం, వ్యక్తిత్వంతో అత్యున్నత స్థాయికి ఎదగగలరని చెప్పడానికి ఆయన జీవితం ఉదాహరణ అని మంత్రి లోకేష్ ప్రశంసించారు.
వైఫల్యాలకు భయపడొద్దు
యువ గ్రాడ్యుయేట్లు పెద్ద కలలు కనాలి. కష్టపడి పనిచేయాలి. వైఫల్యానికి ఎప్పుడూ భయపడవద్దని కోరుతున్నాను. విజయం ఒక గమ్యస్థానం కాదు, అది స్థిరమైన వృద్ధి, లక్ష్యంతో కూడిన ప్రయాణం. కేవలం కెరీర్ను మాత్రమే కాకుండా – ఇతరులకు స్ఫూర్తినిచ్చే జీవితాన్ని నిర్మించుకోండి. మీ మూలాల గురించి గర్వపడండి. లక్ష్యంతో ముందుకు సాగండి. మీ భవిష్యత్తును మాత్రమే కాకుండా దేశభవిష్యత్తును రూపొందించే మార్గదర్శకులుగా నిలవండి. సమాజానికి మార్గం చూపే దివిటీలా మారి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
పట్టభద్రుల జీవితాల్లో కొత్త అధ్యాయం
ఈ రోజు పట్టభద్రుల జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు డిగ్రీలు అందుకుంటున్న గ్రాడ్యుయేట్లందరికీ హృదయపూర్వక అభినందనలు. మీకు మాత్రమే కాదు, మీ తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఈ ప్రయాణంలో మీకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ వేడుక తీపిగుర్తు. మీ కృషి, పట్టుదల, నిబద్ధతకు ఇదొక కొలమానం లాంటిది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది, ఇక రాబోయేది బాధ్యత, అవకాశాలతో నిండిన అధ్యాయం. మీ తల్లిదండ్రులు, కుటుంబం, రాష్ట్రం, దేశానికి మీ కృతజ్ఞతను చూపించాల్సిన ఉంది. మీ డిగ్రీ కేవలం ఒక సర్టిఫికేట్ మాత్రమే కాదు – అది ఒక బాధ్యత. మీ జ్ఞానాన్ని సమాజ హితం కోసం ఉపయోగించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, నవీన ఆవిష్కరణలు చేయడం, విలువలకు కట్టుబడి ధైర్యంతో ముందుకు సాగడం మీ బాధ్యత. మీరంతా సమాజానికి దిక్సూచిగా నిలచే అధ్యాపకులుగా, పరిశోధకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో మీ కలలను సాకారం చేసుకుంటూ భారతదేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ దేశాన్ని ముందుకు నడిపించే మార్గనిర్దేశకులుగా తయారు కావాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
అధునాతన సాంకేతికలపై దృష్టిపెట్టండి
ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్తో సమాజంలోని అన్నిరంగాల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ మార్పులను పసిగట్టడం, ఆరోగ్య సంరక్షణతోపాటు బయోటెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణల ద్వారా మానవ ఆయుర్దాయం పెంచే పరిశోధనలు జరుగుతున్నాయి. సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ సృజనాత్మకతతో నైతిక నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి. మీరు జీవిత లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు కీ ప్లేయర్గా ఉండటం నేర్చుకోండి. మీరు ఎప్పుడూ యంత్రంలో ఒకభాగంలా కాకుండా వ్యవస్థలో ఒక ముఖ్యమైన లీవర్గా ఉండాలి. ప్రపంచానికి కార్మికులు మాత్రమే కాదు, సృష్టికర్తలు కూడా అవసరం. ఉత్తమ ఆవిష్కరణలు మీ అభిరుచుల నుంచే పుడతాయి. జీవితంలో స్థిరపడేందుకు మీ అభిరుచికి తగ్గట్లుగా ఏ మార్గాన్నయినా ఎంచుకోండి. లక్ష్యాన్ని చేరుకునేందుకు బాధ్యతతో ధైర్యంగా ముందుకు సాగాలని మంత్రి లోకేష్ అన్నారు.
స్ఫూర్తిప్రదాతల పుట్టినిల్లు మచిలీపట్నం
దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ట్రేడిరగ్ పోర్టు టౌన్ మచిలీపట్నం. వాణిజ్యం, సంస్కృతి, కళలు, విద్యారంగంలో మార్గదర్శకులను, స్వాతంత్య్ర సమరయోధులను అందించిన నేల మచిలీపట్నం. ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యూరోపియన్లతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఎందరో వ్యాపారులు ఇక్కడకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తొలి మునిసిపాలిటీల్లో మచిలీపట్నం(1866) ఒకటి. ఇక్కడ స్థాపించిన నేషనల్ కాలేజ్ 1906 నాటి వందేమాతరం ఉద్యమానికి పుట్టినిల్లు. మచిలీపట్నం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమైంది. జాతీయజెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, కృష్ణాపత్రిక సంపాదకలు ముట్నూరి కృష్ణారావు, అన్న నందమూరి తారకరామారావు ఈ జిల్లాకు చెందినవారే. కూచిపూడి నృత్య రూపం, కలంకారీ కళకుఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. దీనికి జీఐ ట్యాగ్ కూడా వచ్చింది. బందర్ లడ్డూ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. 1964 నాటి దివిసీమ ఉప్పెన పట్టణ జనాభాలో 50% మందిని (సుమారు 30,000 మందిని) పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత పలుమార్లు తీవ్ర తుఫానులు కూడా వచ్చాయి. అన్నిటినీ తట్టుకుని సమున్నతంగా నిలబడిరదని మంత్రి లోకేష్ అన్నారు.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెరుగుపర్చాలి
కృష్ణా విశ్వవిద్యాలయం 2008లో ఏర్పాటయింది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 2000 మంది విద్య నభస్యసిస్తుండగా, 134 అనుబంధ కళాశాలలలో సుమారు 30,000 మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. 2024-25లో కృష్ణా వర్సిటీ క్యాంపస్లో విద్యనభ్యసించిన విద్యార్థులు 100% ప్లేస్మెంట్ సాధించిన విషయం తెలుసుకుని ఎంతో ఆనందించాను. అయితే అనుబంధ కళాశాలలు గత విద్యా సంవత్సరంలో 50-60% ప్లేస్మెంట్ మాత్రమే సాధించాయి. 2017లో విశ్వవిద్యాలయం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 151-200 బ్యాండ్లో స్థానం సంపాదించినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ర్యాంకింగ్లో వెనుకబడిరది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ను 100 కంటే తక్కువకు తీసుకువచ్చేందుకు తక్షణం చర్యలు ప్రారంభించాలని వర్సిటీ పాలకమండలిని మంత్రి నారా లోకేష్ కోరారు.