అమరావతి (చైతన్యరథం): గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదం ఓ ఘోర దుర్ఘటన.. మాటలకందని విషాదమని అగ్రనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ఘోర ప్రమాదం లో భారతీయులతో పాటు విదేశీయులూ మరణించడం బాధాకరం. ప్రయాణికులతో పాటు సిబ్బంది..విమానం కూలినచోట మరికొందరు ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేస్తోంది. ఈ జాతీయ విపత్తులో ప్రతి ఒక్కరం కేంద్రానికి బాసటగా నిలుద్దామంటూ మృతుల కుటుంబాలకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.