- వీరజవాన్ త్యాగం స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుంది
- కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
- అంతిమ వీడ్కోలు సందర్భంగా నివాళి
అమరావతి(చైతన్యరథం): కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియ లు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిం చారు. వీర జవాన్కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణా లర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగు భూమితో పాటు.. 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదేవిధంగా ఆయన కుటుం బసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీనాయక్ నేడు మన మధ్య లేకపోయినా.. ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటించారు.