- 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు
- 23న ఉదయం 10 నుంచి 12.30 పేపర్-1
- మధ్యాహ్నం 3 నుంచి 5.30 పేపర్-2
- 100 మీటర్ల పరిధిలో 144 నిషేధాజ్ణలు
- వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
అమరావతి(చైతన్యరథం): ఫిబ్రవరి:ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న ఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై గురువారం రాష్ట్ర్ర సచి వాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఎ.అనురాధతో కలిసి ఆయన అధికారులతో సమీక్షిం చారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 13 పాత జిల్లా కేంద్రాల్లోని 175 కేంద్రా ల్లో ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మార్గదర్శకాలను జిల్లాలకు పంపండం జరిగిందని వాటిని పూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు 92,250 మం ది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబం ధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు ప్రసారం చేసినా లేదా సర్క్యులేట్ చేసినా వెంటనే విచారణ చేసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎవరైనా నకిలీ వార్తలు ప్రసారం లేదా వదంతులు స్పష్టించినా అభ్యర్థుల తల్లిదండ్రులు ఏ విధమైన ఆందోళన చెందవద్దని సూచించారు. పరీక్షలు సజావుగా సక్రమంగా జరిగేందుకు వీలుగా ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తిం చిన ప్రాంతాల్లో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పుకార్లు నమ్మవద్దు..23నే పరీక్ష
ఏపీపీఎస్సీ చైర్మన్ ఎ.అనురాధ గ్రూపు-2 మెయిన్ పరీక్షల ఏర్పాట్ల గురించి మాట్లా డుతూ పాత 13 జిల్లా కేంద్రాల్లోని 175 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించడం జరు గుతుందని తెలిపారు. 23న ఉదయం 10 గటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పేపర్-1 రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ఉదయం 9.30 లోపు ఆయా కేంద్రాలకు చేరుకోవాలని, 9.45 గంటలకు గేట్లను మూసివేయాలని సూచించారు. ఆలస్యంగా వచ్చిన వారిని లోనికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకూ పేపర్-2 పరీక్షకు అరగంట ముందే 2.30 లోగా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 2.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసి తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సూచనలతో కూడిన బుక్లెట్ను అన్ని పరీక్షా కేంద్రా లకు పంపడం జరిగిందని వివరించారు. లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు తప్పక పాటించి పరీక్షలు సజావుగా జరిగేలే చూడాలని చెప్పారు. గ్రూప్-2 మెయిన్ పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో పరీక్షలు వాయిదా పడ తాయని దుష్ప్రచారం జరుగుతోందని, అటువంటి వదంతులను అభ్యర్థులు నమ్మవద్దని సూచించా రు. ఎట్టి పరిస్థితుల్లో 23వ తేదీనే పరీక్షలను సజావుగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేని విధంగా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూ చించారు.
కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధిం చాలని చెప్పారు. అదేవిధంగా కేంద్రాల సమీపంలో పరీక్షల సమయంలో జిరాక్స్, నెట్ కేంద్రాలను మూసి ఉంచాలని చెప్పారు. పరీక్ష హాలులోకి మొబైల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ వాచీలు తదతర పరికరాలను అనుతించరాదని తెలిపారు. అవసరమైన మేర కు సీసీటీవీ కవరేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ పరిపాల న శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్కుమార్ మీనా మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఎక్కడైనా సోషల్ మీడియా లేదా ఇతర ప్రచార మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రసారం చేస్తే వెంటనే స్పందించి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించా రు. అలాంటి బోగస్ వార్తలపై వెంటనే స్పందించి కౌంటర్ చేయడంతో పాటు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్, ఆశాఖ కమిషనర్ కృతికా శుక్లా, సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా, ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐఎన్ మూర్తి తదితరు లు పాల్గొనగా వర్చువల్గా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, ఇతర విభాగాల అధికా రులు పాల్గొన్నారు.