- స్త్రీజాతిపై జగన్కు ఎందుకీ ద్వేషం
- మొన్న వేశ్యలంటూ అవమానించారు
- నిన్న సంకరజాతి అంటూ కారుకూతలు
- నేడు రాళ్లు, బీరు బాటిళ్లతో దాడులు
- మహిళలకు జగన్, భారతి క్షమాపణ చెప్పాలి
- మాజీ మంత్రి పీతల సుజాత
అమరావతి (చైతన్యరథం): సాక్షి టీవీ డిబేట్లో అమరావతి మహిళలపై చేసిన అసభ్యవ్యాఖ్యలు యావత్ మహిళాలోకాన్ని అవమానమానించటమేనని మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పీతల సుజాత మాట్లాడుతూ పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ మూకలు, గూండాలు రాళ్లు, బీరు బాటిళ్ళు, చెప్పులతో దాడి చేయడం హేయమని మండిపడ్డారు. అమరావతి మహిళలను సంకర జాతి అని మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిది అసలు నోరా, తాటి మట్టా? ఆయనది మానవ జాతే కాదు. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ రెడ్డి మహిళలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. సాక్షిమీడియా, ఛానల్లను అడ్డంపెట్టుకొని మహిళా లోకాన్నే అవమానపరుస్తున్నారు. మొన్నేమో మహిళలను వేశ్యలు అన్నారు.. నిన్న సంకర జాతి అన్నారు… నేడు పొదిలిలో బీరు బాటిళ్ళతో దాడి చేయించారు. మహిళలపై జగన్కు ఎందుకీ విద్వేషం అని పీతల సుజాత నిలదీశారు.
దెయ్యాలు వేదాలు వల్లిస్లున్నట్లుగా..
మహిళలపై అరాచకాలు చేయించడం జగన్రెడ్డికి అలవాటుగా మారింది. గతంలో టీడీపీ కార్యకర్త ఒకరు మహిళలను కించపరిచే మాటలు మాట్లాడితే సొంత పార్టీవాడైనా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకున్నాం. అది టీడీపీ గొప్పతనం. ప్రస్తుతం జగన్, భారతి రెడ్డి కలిసి సాక్షి డిబేట్లో మహిళలను కించపరిచేలా మీ పేటీఎం జర్నలిస్టుతో మాట్లాడిరచడం మహిళలను కించపరచడమే. పబ్లిసిటీ పిచ్చి ఉన్న వైసీపీ నాయకురాలు రోజా ఒక మహిళ అయి ఉండి.. మహిళలను వేశ్యలు అనడాన్ని ఖండిరచకుండా తిరిగి ప్రభుత్వాన్నే దూషించడం ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మహిళా నేతలు.. తల్లుల పెంపకం సరిగా లేదు, తాగిన మైకంలో రేప్ చేశారు, ఒకటి, రెండు రేపులకే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని సిగ్గు లేకుండా మాట్లాడిన సందర్భాలున్నాయి. నాడు చిలకపలుకులు పలికిన రోజా నేడు నీతులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది. మహిళలను కించపరిచేలా మాట్లాడిరచిన జగన్ రెడ్డి, భారతి రెడ్డి.. వాళ్ళ ముక్కును అమరావతి నేలకు రాసి మహిళలకు క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని సుజాత తెలిపారు.
తప్పు చేస్తే తాటతీస్తాం
ఏ మహిళకు అన్యాయం జరగకూడదనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జగన్కు మహిళలంటే ఇంతటి చులకనభావం ఎందుకు? మహిళల్ని అతి దారుణంగా అవమానిస్తున్నారు. వారి సొంంత ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాతి నీచంగా, ఘోరంగా అసభ్యకరమైన పదజాలంతో అవమానించారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మహిళలు ఏం పాపం చేశారని, వారిని అలా ఆడిపోసుకుంటున్నారు. రాజధాని అమరావతి మహిళల్ని అవమానపరచడం రాష్ట్ర మహిళా లోకాన్నే కాదు ప్రపంచంలోని తెలుగు మహిళలందరినీ అవమానించినట్లే. మహిళలతోపాటు దళితులను కూడా అవమానిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గం దళితులది. రాజధానిలో భాగమైన తాడికొండ నియోజకవర్గంలోని దళితులను అవమానించారు. వైసీపీ నాయకులకు మానవత్వమనేదే లేదు. ముఖ్యంగా జగన్కు అస్సలు లేదు. ఉంటే తల్లిని, చెల్లిని బయటికి గెంటేసేవారా?. తల్లి, చెల్లి పై కూడా దారుణంగా విమర్శలు చేయించారు. వారిని అవమానించి మానసికంగా కుంగిపోయేలా చేశారు. ఈ విషయాలు ప్రజలు మరచిపోలేదు. తండ్రిని చంపిన వారిని శిక్షించాలి, నాకు న్యాయం చేయాలని సునీతారెడ్డి జగన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఆమెను కూడా సోషల్ మీడియాలో అసభ్యంగా తిట్టించారు.
కుటుంబంలోని తల్లి, చెల్లికే విలువ, గౌరవం ఇవ్వనివారు ఇక రాష్ట్ర మహిళలకు ఏం గౌరవమిస్తారు? మహిళల్ని, అవమానించినా, అగౌరవపరచినా, నీచంగా మాట్లాడినా ఎవరినీకూడా కూటమి ప్రభుత్వం వదలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు మహిళల పక్షపాతి. తప్పు చేస్తే సొంత పార్టీవారైనా వదలిపెట్టరు. తప్పకుండా శిక్ష పడేలా చేస్తారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని ఒక కుటుంబంలా చూసుకుంటున్నారు. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడగలిగేలా చేస్తున్నారు. ఎన్టీరామారావు మహిళల్ని ఎలా గౌరవించారో, చంద్రబాబు కూడా మహిళల్ని అలా గౌరవిస్తూ వస్తున్నారు. వారికి అండగా ఉంటూ వారికి తోడ్పాటునందిస్తున్నారు. అందుకే రాష్ట్ర మహిళలందరూ చంద్రబాబును చంద్రన్న అని పిలుచుకుంటారు. మహిళలపట్ల తప్పు చేసిన వారి తాట తీయడమే చంద్రబాబు లక్ష్యం. టీవీ డిబేట్లలో కూర్చొని మహిళలను అవమానించి జర్నలిస్టు ముసుగులో ఏది మాట్లాడేసినా చెల్లుతుందనుకుంటే అది తప్పు. మహిళలపట్ల అమానుషంగా ప్రవర్తించినవారు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా.. తీసుకొస్తాం, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మహిళలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఇకనైనా బుద్ధితెచ్చుకొని భారతి రెడ్డి, జగన్.. చేసిన తప్పుకి అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి. అప్పుడే వారికి మహిళలపట్ల గౌరవం ఉందని భావిస్తామని పీతల సుజాత స్పష్టం చేశారు.