- ఎక్కడా రాజీపడేది లేదు
- ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రాజశేఖర్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అభివృద్ధికి ఎక్కడా రాజీపడకుండా చర్యలు చేపడుతున్నట్టు ఎడ్యు కేషనల్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ ఎస్.రాజశేఖర్ తెలిపారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాను సారం గురుకుల పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబోలులో పర్య టించారు. బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. మౌలి కవసతులు, హాస్టల్ గదులు, డైనింగ్ హాల్, తరగతి గదులను పరి శీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపా యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారు లతో సమావేశం నిర్వహించి గురుకుల పాఠశాలలో ఉన్నత ప్రమా ణాలతో మంచి వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యల తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పను ల్లో ఎక్కడా రాజీపడకుండా పనిచేయాలని సూచించారు.