- మద్యం కుంభకోణంలో జైలు ఖాయం
- మహానాడు విజయం ఓర్వలేకే విమర్శలు
- కడపలో స్టీల్ ప్లాంటుతో ఉద్యోగాలు
- స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి
కడప(చైతన్యరథం): సిట్ బృందం త్వరలో తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత, ఏపీ స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప టీడీపీ మహానాడు వేదిక ఏర్పాట్ల మెటీరియల్ తొలగింపు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిట్ బృందం త్వరలో తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. ఈసారి స్వచ్ఛ మహానాడు నిర్వహించామన్నారు. మహా నాడు ప్రాంతాన్ని కార్యక్రమం అయిన తర్వాత కూడా స్వచ్చ Ûప్రాంతంగా చేస్తున్నామని తెలిపారు. కడపలో జరిగిన మహానాడును చూసి ఓర్వలేక వైసీపీ వారు లేనిపోని ఆరోప ణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ పార్టీని ప్రజలు అరుంధతి సినిమా వలె సమాధి కట్టే శారని వ్యాఖ్యానించారు.
జగన్ ఏమైనా చేయగలడు
ఏడాది క్రితం వరకు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది.. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందని పేర్కొన్నారు. విచారణలో ఆయన పేరు చెప్తే మా ప్రాణాలు దక్కవంటూ కసిరెడ్డి అనడం ఏమనుకోవాలి? చిన్నాన్నకే పోటు వేసిన జగన్ ఎవరిని.. ఏమైనా చేయ గలడంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా జగన్రెడ్డి తన సొంత నియోజకవర్గానికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కాబోతుందని స్పష్టం చేశారు.