అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శనివారంనుంచి 17వ తేదీ వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా ఉత్తమ ప్రతిభ కనబరచాలని చంద్రబాబు ఆకాక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు సజావుగా రాయాలని మంత్రి లోకేశ్ కోరారు. వేసవి దృష్ట్యా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డీహైడ్రేషన్కు గురికాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యామంత్రి లోకేష్ విద్యార్థులకు ఎక్స్ పోస్టులో సూచించారు.