- భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్మిషన్ లైన్స్
- ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి
- వ్యవసాయ వ్యర్ధాల సద్వినియోగమయ్యేలా యూనిట్ల ఏర్పాటు
- ఆధునిక భద్రతా ప్రమాణాలతో పారిశ్రామిక ప్రాజెక్టులు
- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎసఐపీబీ సమావేశం
- రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం
- ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగావకాశాలు
- అమరావతి క్వాంటంవ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను పెద్దఎత్తున ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ను తయారు చేసుకునేందుకు వీలుందని సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్ మిషన్ లైన్లను కూడా సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎసఐపీబీ సమావేశం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, పి.నారాయణ, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ జి సాయిప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ.39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియచేసింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుదుత్పత్తి చేసే సామర్ధ్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్పత్తి అయిన విద్యుత్ను స్టేట్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్కు అనుసంధానించేలా చూడాలని మంత్రి లోకేష్ సూచించారు. దీనిపై స్పందించిన సీఎం సమీప భవిష్యత్తులో ఉత్పత్తి అయిన విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసేలా ట్రాన్స్మిషన్ లైన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్లో సౌర విద్యుదుత్పత్తి జరుగుతున్నా..
పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉందని.. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కంజ్యూమర్ ప్రాడెక్ట్స్ తయారీలో ఏపీ కీలకంగా మారాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీసిటీ, కొప్పర్తి, అనంతపూర్లలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నారు. రాష్ట్రంలో జీసీసీల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీ జీసీసీలకు కేంద్రంగా మారాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా కల్చర్ రంగాల్లో వస్తున్న వ్యర్ధాలను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టులను ఆహ్వానించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రంగాల్లో కాలుష్య కారకాలు లేకుండా ఇథనాల్ తరహా బై ప్రాడెక్టులు వచ్చేలా చూడాలని దీనికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయాలన్నారు. దీనిపై కేంద్రంనుంచి సహకారం కూడా తీసుకోవాలని సూచించారు.
పారిశ్రామిక ప్రాజెక్టుల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు
రాష్ట్రంలో వివిధ పెట్టుబడి ప్రతిపాదనతో వస్తున్న పరిశ్రమల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవటంపై కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనేలా ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ను నిర్దేశించాలన్నారు. ఫార్మా, స్టీల్, గ్రీన్ ఎనర్జీ, బీఈఎస్లాంటి ప్రాజెక్టులు ఏర్పాటవుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకంగా ఎసఓపీని సిద్ధం చేయాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాలను పారిశ్రామిక యూనిట్లు కలిగి ఉండాలని తేల్చి చెప్పారు. ఇటీవల రాష్ట్రంలోని బాణాసంచా తయారీ యూనిట్లలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాణాసంచా తయారీ యూనిట్లు, మిల్క్ డెయిరీలులాంటి అంశాల్లో ఉల్లంఘనలు లేకుండా ప్రామాణిక విధానాలు జారీ చేయాలని సూచించారు. నిర్దేశిత ప్రమాణాలను పాటించే విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతి క్వాంటం టవర్స్ను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భూములు కేటాయించిన పర్యాటక ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని.. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదన్నారు.
వేగంగా ప్రాజెక్టులు గ్రౌండింగ్
రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం పొందిన ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వీటితోపాటు భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా సాకారమయ్యేలా చర్యలు చేపట్టాలని, ప్రత్యేకించి ఆయా ప్రభుత్వ శాఖలు వీటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆయా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. భారీ ప్రాజెక్టులపై ప్రతీ ఎసఐపీబీ సమావేశంలోనూ సమీక్షిద్దామని సీఎం స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉత్పత్తి సామర్ధ్యం పెరగాలన్నారు. పామాయిల్, కోకోలాంటి ఉద్యాన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలని సీఎం సూచించారు. ఉద్యాన ఉత్పత్తులు 200 లక్షల మెట్రిక్ టన్నులనుంచి 400 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగాలన్నారు. దీనికి తగినట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెరిగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. ప్రాడెక్టు పర్ఫెక్షన్పైనా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంఎసఎంఈ పార్కుల్లో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలని సీఎం సూచించారు. తాజాగా 16వ ఎసఐపీబీ సమావేశం ఆమోదించిన పెట్టుబడులతో కలిపి రాష్ట్రంలో గడచిన 22 నెలల్లో ఇప్పటి వరకు 264 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులు, 9.6 లక్షలమందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా 538 ఎంఓయూలకుగానూ రూ.11.38 లక్షల పెట్టుబడులు, 13.95 లక్షలమందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 802 ప్రాజెక్టుల ద్వారా రూ.20.74 లక్షల కోట్ల పెట్టుబడులు, 23.55 లక్షల ఉద్యోగాల కల్పన జరుగనుంది.
16వ ఎసఐపీబీలో ఆమోదం పొందిన పెట్టుబడులు:
మొత్తం ప్రాజెక్టులు: 31
మొత్తం పెట్టుబడి విలువ: రూ.39,436.84 కోట్లు
మొత్తం ఉద్యోగాలు: 1,11,278
విద్యుత్ రంగం: మొత్తం 8 ప్రాజెక్టుల్లో రూ.12,552 కోట్ల పెట్టుబడులు. 69,070 ఉద్యోగావకాశాలు.
1. క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ -కడప, అనంతపురం జిల్లాలు -రూ.1,391 కోట్ల పెట్టుబడి -190 ఉద్యోగాలు
2. క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ -కడప జిల్లా -రూ.1,391 కోట్ల పెట్టుబడి -190 ఉద్యోగాలు.
3. ఎస్సార్ రెన్యువబుల్స్ సోలార్ టు లిమిటెడ్ -కర్నూలు జిల్లా -రూ.1,327 కోట్ల పెట్టుబడి -1,035 ఉద్యోగాలు.
4. ఎస్సార్ రెన్యువబుల్స్ హైబ్రిడ్ వన్ లిమిటెడ్ -కర్నూలు జిల్లా -రూ.2,714 కోట్ల పెట్టుబడి -1,240 ఉద్యోగాలు
5. ఎస్సార్ రెన్యువబుల్స్ హైబ్రిడ్ వన్ లిమిటెడ్ -అనంతపురం జిల్లా -రూ.1,714 కోట్ల పెట్టుబడి -220 ఉద్యోగాలు
6. పేస్ డిజిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ -కడప జిల్లా -రూ.745 కోట్ల పెట్టుబడి -345 ఉద్యోగాలు
7. ఎసఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ -పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయనగరం జిల్లాలు -రూ.3,200 కోట్ల పెట్టుబడి -65,000 ఉద్యోగాలు
8. హెచ్హెచ్పీ ఎయిట్ ప్రైవేట్ లిమిటెడ్ -తిరుపతి జిల్లా -రూ.70 కోట్ల పెట్టుబడి -850 ఉద్యోగాలు
ఐటీ, ఈ అండ్ సీ: మొత్తం 11 ప్రాజెక్టల్లో రూ.18,210.36 కోట్ల పెట్టుబడులు. 36,411 ఉద్యోగాలు
9. ఇన్ఫోసిస్ లిమిటెడ్ -యండాడ, విశాఖపట్నం -రూ.750 కోట్ల పెట్టుబడి -7,000 ఉద్యోగాలు
10. క్రెడెన్స్ రియాలిటీ -తాళ్లవలస, విశాఖపట్నం -రూ.386.88 కోట్ల పెట్టుబడి -6,500 ఉద్యోగాలు
11. ఫ్యూజీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ -కాపులుప్పాడ, విశాఖపట్నం -రూ.425 కోట్ల పెట్టుబడి -2,500 ఉద్యోగాలు
12. శ్రీటెక్ డేటా లిమిటెడ్ -కాపులుప్పాడ, విశాఖపట్నం -రూ.1,800 కోట్ల పెట్టుబడి
13. పీజీ టెక్నోప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ -శ్రీసిటీ, తిరుపతి జిల్లా -రూ.1,305 కోట్ల పెట్టుబడి. `2,910 ఉద్యోగాలు.
14. ఎన్పీఎస్పీఎల్ స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ -కుప్పం, చిత్తూరు జిల్లా -రూ.2,550 కోట్ల పెట్టుబడి -400 ఉద్యోగాలు.
15. ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ -విశాఖపట్నం -రూ.626.90 కోట్లు పెట్టుబడి -12,500 ఉద్యోగాలు
16. ఆరఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ -శ్రీ సత్య సాయి జిల్లా -రూ.10,239.78 కోట్ల పెట్టుబడులు -3,017 ఉద్యోగాలు
17. సీ డాక్ `అమరావతి క్వాంటం వ్యాలీ -రూ.17 కోట్ల పెట్టుబడి -12 ఉద్యోగాలు.
18. పీక్యూ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ -అమరావతి క్వాంటం వ్యాలీ -రూ.1.8 కోట్ల పెట్టుబడి -20 ఉద్యోగాలు.
19. క్వాంటం ఏఐ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ -అమరావతి క్వాంటం వ్యాలీ -రూ.108 కోట్ల పెట్టుబడి -1,552 20.ఉద్యోగాలు.పర్యాటక రంగం: మొత్తం 2 ప్రాజెక్టుల్లో రూ.200.15 కోట్ల పెట్టుబడులు, 270 ఉద్యోగాలు
21. సన్ రే గ్రీన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ -విజయనగరం -రూ.117.66 కోట్ల పెట్టుబడి -150 ఉద్యోగాలు.
22. రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎలఎల్పీ -ఒంగోలు -రూ.82.49 కోట్ల పెట్టుబడి -120 ఉద్యోగాలు.ఫుడ్ ప్రాసెసింగ్: మొత్తం 23. ప్రాజెక్టుల్లో రూ.1,222.73 కోట్ల పెట్టుబడులు. 550 ఉద్యోగాలు.
24 ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ -తిరుపతి -రూ.233.73 కోట్ల పెట్టుబడి -100 ఉద్యోగాలు.
25. రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ -చిత్తూరు -రూ.989 కోట్ల పెట్టుబడి -450 ఉద్యోగాలు.
26ఇండస్ట్రీస్, కామర్స్: మొత్తం 8 ప్రాజెక్టుల్లో రూ.7,251.6 కోట్ల పెట్టుబడులు, 4,977 ఉద్యోగాలు.
24. మెట్రో డెకరేటివ్ లిమిటెడ్ -నాయుడుపేట -రూ.1,032 కోట్ల పెట్టుబడి -400 ఉద్యోగాలు.
25. ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ పెల్లెట్ ప్లాంట్ 3 -విశాఖపట్నం -రూ.1,400 కోట్ల పెట్టుబడి -250 ఉద్యోగాలు.
26. శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ -ఎస్పీఎస్సార్ నెల్లూరు -రూ.3,678 కోట్ల పెట్టుబడి -3,200 ఉద్యోగాలు.
27. బాల్ బెవరేజెస్ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ -శ్రీసిటీ -రూ.633 కోట్ల పెట్టుబడి -117 ఉద్యోగాలు.
28. సాన్సో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ -ఏలూరు -రూ.80 కోట్ల పెట్టుబడి -210 ఉద్యోగాలు.
29. ఆరఎస్బీ ట్రాన్సిమిషన్ లిమిటెడ్ -శ్రీసిటీ -రూ.143.99 కోట్ల పెట్టుబడి -350 ఉద్యోగాలు.
30. వెంకటేశ్వర పేపర్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ -కృష్ణా -రూ.63.61 కోట్ల పెట్టుబడి -100 ఉద్యోగాలు.
31. అనాడ్రోన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ -ఎస్పీఎస్సార్ నెల్లూరు -రూ.221 కోట్ల పెట్టుబడి -350 ఉద్యోగాలు.













