- పవన్, ఇతర మంత్రులకు పుస్తకం ప్రతులు అందజేసిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): జగన్ రాక్షస పాలనపై యువనేత లోకేష్ పూరించిన శంఖారావమే యువగళమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా బుధవారం రాష్ట్ర సచివాలయంలో పవన్తో పాటు, ఇతర మంత్రులకు పుస్తక ప్రతిని లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్కళ్యాణ్ మాట్లాడుతూ… నాటి దుర్మార్గ పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమయిందన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తెచ్చినందుకు లోకేష్ను ప్రశంసించారు. అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేష్… పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు.