- రెవెన్యూ లోటు భర్తీ చేయండి
- అమరావతికి రెండో విడత నిధులు గ్రాంటుగా ఇవ్వండి
- కేంద్ర ఆర్థికమంత్రికి సీఎం చంద్రబాబు వినతి
ఢీల్లీ (చైతన్యరథం): రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్థిక సాయం పథకం సాస్కి(ూAూజI) కింద 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కు అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. రెండో రోజు ఢీల్లీ పర్యటనలో భాగంగా బుధవారం నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం కోరుతూ వినతిపత్రం అందించారు. రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరుతూ 16వ ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వినతిని అంగీకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక వనరుల లోటును ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి వివరించారు.
గ్రాంటుగా అమరావతికి రెండో విడత సాయం
అమరావతి నిర్మాణానికి మొత్తం రూ.79,280 కోట్ల నిధులు అవసరం కాగా, ప్రస్తుతం రూ.44,351 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి తెలిపారు. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.26,000 కోట్ల నిధులు సమీకరించనట్టు వెల్లడిరచారు. రాజధాని నిర్మాణానికి ఇంకా నిధుల అవసరం ఉందని వివరించారు. అమరావతికి రెండో విడతగా ఇచ్చే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.