పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచిన పరిణితి
ఏపీ అనుకూలతలపై సమర్థ ప్రసంగాలు, చర్చలు
సింగపూర్ టూర్ సక్సెస్తో స్వదేశానికి చేరిన యువనేత
సింగపూర్ (అమరావతి): రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. నాలుగురోజుల పర్యటన ముగించుకొని గురువారం స్వరాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేష్కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కనీవినీ ఎరుగనిరీతిలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తల నుంచి లభించిన స్పందన ఏపీ బ్రాండ్ ఇమేజ్ను ఇనుమడిరపజేసింది. నాలుగురోజుల పర్యటనలో సీఎంతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ చర్చలు 19, జి టు జి (గవర్నమెంటు టు గవర్నమెంట్) సమావేశాలు 6, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 సైట్ విజిట్లు, రోడ్ షో/ డయాస్పోరా ఈవెంట్స్ 2 కలిపి మొత్తం 35 కార్యక్రమాలకు లోకేష్ హాజరయ్యారు.
ముఖ్యమంత్రి నేతృత్వంలో సింగపూర్ వెళ్లిన బృందానికి సామాన్య తెలుగు ప్రవాసభారతీయుడి నుంచి… ఆ దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం వరకు అపూర్వ స్వాగతం లభించింది. ఈనెల 27న తొలిరోజు ఏపీఎన్ఆర్టి ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ చేసిన ప్రసంగం సింగపూర్ ఎన్ఆర్ఐలలో స్ఫూర్తినింపింది. ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేయడంలో ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేష్ ఇచ్చిన పిలుపు వారిలో చైతన్యాన్ని నింపింది. 4రోజుల పర్యటనలో ఎయిర్బస్, ఎవర్వోల్ట్, గూగుల్ క్లౌడ్, మైక్రో సాఫ్ట్, మురాటా ఇంజనీరింగ్, కెరియర్, ఇన్ఫినియన్, ఐవిపి సెమి, క్యాపిటాల్యాండ్, ఎ బీమ్ కన్సల్టింగ్, డిటిడిఎస్ వంటి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ ఫలవంతమైన చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు నెలకొన్న అనుకూలతలు, అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, అందజేస్తున్న ప్రోత్సాహాకాలు, అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను వివరిస్తూ మంత్రి జరిపిన చర్చలు పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేశాయి. ఏపీలో పరిశ్రమలు స్థాపించడం వల్ల కలిగే ప్రయోజనాలను లోకేష్ ద్వారా ఆసక్తిగా తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు తమ సంస్థల ఉన్నతస్థాయి బృందాలతో చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని మాట ఇచ్చారు. ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక అనుమతుల నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఆయా సంస్థల పూర్తి బాధ్యత తమదేనంటూ రెండోరోజు ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి ఇచ్చిన భరోసా పరిశ్రమదారులను ఆకర్షించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా, దావోస్ పర్యటనల తర్వాత సింగపూర్లో మంత్రి లోకేష్ చేసిన పెట్టుబడుల యాత్ర విజయవంతమై.. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపింది.